జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన అనకాపల్లి ఎంపీ అవంతి

-

ఏపీలో అధికార పార్టీ టీడీపీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. అవి మామూలు దెబ్బలు కాదు కోలుకోలేని దెబ్బలు. ఒకదాని తర్వాత మరోటి… ఒకరి తర్వాత మరొకరు టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరుతున్నారు.

తాజాగా అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ వైఎస్సార్సీపీ లో చేరారు. వైఎస్ జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్… అవంతికి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

అవంతి వైసీపీలో చేరుతారని.. ఇవాళ జగన్ ను కలిసి తన రాజకీయ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తారని ఊహాగానాలు వెలువడ్డాయి. వాటిని నిజం చేస్తూ టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీ లో చేరారు అవంతి.

అవంతితో పాటు ఉత్తరాంధ్రకు చెందిన మరికొందరు టీడీపీ ముఖ్యులు కూడా వైసీపీలో చేరడానికి సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ మేడ మల్లికార్జున్ రెడ్డి వైసీపీలో చేరారు. ఆయన తర్వాత చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news