కాసేపట్లో గవర్నర్ తో జగన్ భేటీ… ఇవే చర్చించే అంశాలు

-

చాన్నాళ్ళ తర్వాత ఏపీ సిఎం వైఎస్ జగన్ గవర్నర్ తో భేటీ అవుతున్నారు. మరికాసేపట్లో గవర్నర్ తో ఏపి సిఎం వైఎస్ జగన్ భేటీ అవుతున్నారు. గవర్నర్ కు దీపావళి శుభాకాంక్షలు తెలుపనున్న సీఎం… పలు కీలక అంశాలపై చర్చిస్తారు. అసెంబ్లీ సమావేశాలు, తాజా రాజకీయ పరిణామాల పైన ఆయన గవర్నర్ తో చర్చిస్తారు. పోలవరం విషయం లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.

యూనివర్సిటీ విసి ల నియామకం పై ఫైల్ గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్నందున దానిపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తుంది. అసెంబ్లీ సమావేశాల తేదీ ల పైన బిల్లుల పైన చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రం లో తాజా రాజకీయా పరిణామాలుపై చర్చ జరుగుతుంది. అంతే కాదు స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ సమావేశంలో చర్చిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news