ఏపీ హైకోర్టు జ‌గ‌న్‌ను మెచ్చ‌డం లేదా ? షాకుల మీద షాకులు..!

-

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏడాది కాలంలో హైకోర్ట్ ఎన్నో షాకులు ఇచ్చింది. జగన్ సర్కార్ తీసుకునే నిర్ణయాలను హైకోర్ట్ తప్పుబడుతునే ఉంది. ప్రతీ నిర్ణయంలో ఎవరో ఒకరు పిటీషన్ వేయడం దానిపై హైకోర్ట్ విచారణ చేయడం అదే విధంగా వ్యతిరేకంగా తీర్పు రావడం, విరుద్దంగా ఆదేశాలు రావడంతో ఇప్పుడు ఏపీ సర్కార్ బాగా ఇబ్బంది పడుతుంది. దాదాపు 65 పైగా షాకులను ఏపీ హైకోర్ట్ ఇచ్చింది. అసలు ఎక్కడ ఎక్కడ ఏయే షాక్ లు ఇచ్చింది అనేది చూస్తే…

ఎందుకీ తొందర- పీపీఏల సమీక్ష అధికారం మీకెక్కడిది? ధరలు నిర్ణయించేది ఈఆర్‌సీ – తగ్గించుకోవాలని బెదిరింపులా?: 26.07.19

మేం చెప్పినా ఇంతేనా? – విద్యుత్‌ కొనుగోలు చేయరా? – ఇది మా ఆదేశాల ఉల్లంఘనగా భావించాలి: 31.07.19

చంద్రబాబుకు భద్రత తగ్గించవద్దు – కాన్వాయ్‌లో జామర్‌ ఉండాల్సిందే : 15.08.19

పోలవరం జల విద్యుత్‌ ప్రాజెక్టు కాంట్రాక్టు విషయంలో రివర్స్‌ చెల్లదు – కాంట్రాక్టు రద్దు కుదరదు – ఇది జెన్కో

కుదుర్చుకున్న ఒప్పందం రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి లేదు – రద్దు నిబంధనలు అనుసరించలేదు. : 23.08.19

స్విస్‌ ఛాలెంజ్‌పై మీ వైఖరింటి?: 04.09.19

బందరు పోర్టుకు భూముల్ని అప్పగించడంలో సర్కారు విఫలం – జీవో నిలిపివేస్తూ ఉత్తర్వులివ్వండి- మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దన్న ఏజీ: 13.09.19

వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్లను ఎందుకు తొలగించారో వివరణ ఇవ్వాలి: 14.09.19

మీ పద్దతి బాగోలేదు – ధరలు ఖరారు పిటీషన్లను త్వరగా తేల్చాలని ఏపీఈఆర్‌సీకి ఆదేశం : 17.09.19

పాలక మండలి ఇదేం పద్దతి?- విశ్వవిద్యాలయాల చట్టంకు విరుద్దంగా నిర్ణయాలు : 29.10.19

రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ధరలకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్‌ విక్రయిస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? : 02.11.19

ప్రభుత్వం తీరుపై హైకోర్టు ఆక్షేపణ – ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలకు కేయించేందుకు ఓ విధానం అంటూ లేదా? : 14.11.19

రాజధాని కమిటీపై మీ వైఖరేంటి? బొత్సా, బుగ్గన్నలకు నోటీసులు: 15.11.19

కోర్టు ఆదేశాలంటే లెక్కలేదా? – పంచాయితీ ఎన్నికలు జరపరా?: 15.11.19

పాస్టర్లు, ఇమాం, మౌజన్‌లకు ఏ నిబంధన ప్రకారం పారితోషకం: 28.11.19

ఆలయ బోర్డుల రద్దు మీ ఇష్టానుసారంగా చేయడానికి వీల్లేదు : 30.11.19

మద్య నిషేదమే లక్ష్యమైతే రిటైల్‌ను తగ్గించరేం? – బార్లను తగ్గించడంలో మతులబేంటి? : 04.12.19

ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులా? – ప్రజాస్వామ్య దేశంలో ఇదేం పద్దతి? – ఎవరి అనుమతులతో చేస్తున్నారో నిలదీత – : 14.12.19

సౌర, పవన, విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు బకాయిలు ఎందుకు చెల్లించడం లేదు: 20.12.19

బార్ల సంఖ్యను తగ్గించాలనుకున్నప్పుడు ముందుగా గుర్తించి యజమానులకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాల్సింది: 20.12.19

విద్యుత్‌ బకాయిలు తక్షణం చెల్లించండి – సింగిల్‌ జడ్జి ఉత్తర్వులపై ఇంత జాప్యమా: 21.12.19

అంతా ఆంగ్లం కుదరదు – విద్యా హక్కు చ్టానికి అది విరుద్దమే – ఇంగ్లీష్‌ జీవోకు బ్రేక్‌: 21.12.19

ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ ఉండగా ఇంచార్జ్‌ ఛైర్మన్‌ ఎలా నియమిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు : 22.12.19

బార్‌ లైసెన్సుల ఉపసంహరణపై స్టే – కొత్త లైసెన్సుల మంజూరు ప్రక్రియ నిలిపివేత : 24.12.19

వీసీగా దామోదర్‌ నాయుడికి అర్హత ఉంది – నియమకాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాఖ్యలు కొట్టివేత : 24.12.19

ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ ఉదయ్‌భాస్కర్‌ విధుల్లో ఎవ్వరూ జోక్యం చేసుకోవద్దు : 25.12.19

ఐపీఎస్‌ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెషన్‌పై ఘాటు వ్యాఖ్యలు – పాలించే పద్ధతి ఇది కాదు – హోదా మార్చి బదిలీ చేస్తారా.. ఎంత ధైర్యం?- ప్రభుత్వాన్ని తప్పుడు శక్తులు నడిపిస్తున్నాయి – రాజకీయ కక్షతో ఎంత వెంటాడారో అందరికి తెలుసు : 25.12.19

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ నిమిత్తం జనవరి 7వ తేదీ మధ్యాహ్నం 2గంటల లోపు రిజర్వేషన్లు ఖరారు చేసి ఆ వివరాలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేయాలని ఆదేశం : 03.01.2020

ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద 2019-20 సంవత్సరానికి సంబంధించి మొది విడత చెల్లింపుల్లో భాగంగా.. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.1,845 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు జమ చేయకపోవడంపై హైకోర్టు సీరియస్‌. నెల రోజుల్లో వాటిని జమ చేయాలని ఆదేశం. : 08.01.2020

రాజధాని గ్రామాలలో శాంతియుత నిరసనలపై 144 సెక్షన్‌ విధించడంపై హైకోర్టు సీరియస్‌. : 13.01.2020

రాజధాని గ్రామాలలో 144 సెక్షన్‌ విధింపుపై మరోసారి హైకోర్టు ఆగ్రహం. రాజధాని ప్రాంతంలో పోలీసుల భారీ కవాతు, ఆందోళనలో పాల్గొన్న మహిళలను బూటు కాలుతో తన్నడం, మగ పోలీసులు మహిళలను అరెస్ట్‌ చేయడంపై సీరియస్‌. : 17.01.2020

రాజధానితో ముడిపడి ఉన్న వ్యాజ్యాల విచారణను ఫిబ్రవరి 26కు వాయిదా వేసిన హైకోర్టు. ఈలోపు కార్యాలయాల తరలింపునకు చర్యలు చేపడితే రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత అధికారులు బాధ్యులవుతారు. ఖర్చుచేసిన సొమ్మును అధికారుల జేబు నుంచి రాబడతాం. : 23.01.2020

విజయవాడలోని శ్రీదుర్గామల్లేశ్వరస్వామివారి దేవస్థానం ఈవో నియామక జీవోను తప్పబట్టిన హైకోర్టు. ఆ జీవోను రద్దు చేయాలని ఆదేశం. : 25.01.2020

ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమం స్థానంలో ఆంగ్ల మాధ్యమం తీసుకొచ్చే చర్యల్లో భాగంగా పాఠ్యపుస్తకాల ముద్రణ, శిక్షణ తరగతులు తదితర చర్యలు చేపడితే ఖర్చును బాధ్యులైన అధికారుల నుంచి రాబడతాం. : 27.01.2020

ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీల రంగులు వేయడానికి వీల్లేదు. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్న తరుణంలో పంచాయతీ కార్యాలయాలకు పార్టీ రంగులేస్తుంటే రాష్ట్ర ఎన్నికల సంఘం ఏం చేస్తోంది..? రెండు వారాల్లోగా రంగులు తొలగించాలి. : 27.01.2020

వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగించేందుకు అభ్యంతరమేమిటో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు. జగన్మోహన్‌రెడ్డి విపక్షనేతగా ఉండగా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ అభ్యర్థనపై వైఖరి ఏమిటో చెప్పాలి. : 28.01.2020

జీవీఎంసీ (గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌) ఎన్నికల నోటిఫికేషన్‌ ఎప్పుడు..? : 29.01.2020

పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులు పెండింగ్‌లో ఉండగా.. రాజధాని వ్యవహారంపై పిషన్లు కోర్టు విచారణలో ఉండగా కార్యాలయాల తరలింపుకు ఎందుకంత తొందర..? : 04.02.2020

పార్లమెంట్లో పీఎం ఫో లేదు. హైకోర్టులపై సీజే ఫోలూ లేవు. కానీ ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీ భవనాలపై ముఖ్యమంత్రి బొమ్మ ఎందుకు..? : 05.02.2020

సౌర, పవన విద్యుదుత్పత్తి సంస్థల బకాయిలు 4 వారాల్లోగా చెల్లిస్తామని హామీనిచ్చి.. ఇప్పివరకు ఎందుకు చెల్లించలేదు..? ఏపీఎస్పీడీసీఎల్‌ను ప్రశ్నించిన హైకోర్టు. : 05.02.2020

స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వ కార్యాలయాలపై పార్టీ రంగులా..? దీనిపై కేంద్ర వైఖరి తెలపాలి. : 06.02.2020

ఐఆర్‌ఎస్‌ అధికారి జాస్తి కృష్ణ కిశోర్‌ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరు సరికాదు. డిప్యుటేషన్‌ పై ఉన్న అధికారిని సస్పెండ్‌ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను తప్పుబ్టింది. కృష్ణ కిశోర్‌ ను వెంటనే ఐటీ శాఖలో చేర్చుకోవాలని ఆదేశించింది. 25.02.2020

ఎమర్జెన్సీని తలపిస్తున్న పోలీసులు – బీహార్ కన్నా ఏపీలోనే అక్రమ నిబంధనలు ఎక్కువయ్యాయి : 26.02.2020

జీఎన్ రావు బోస్టన్ కమిటీల ఫైళ్లన్నీ అప్పగించండి. 27.02.2020

వన్ సైడ్ గేమ్ కుదరదు, రాజధాని కోసం రైతులిచ్చిన భూముల్ని ఇళ్ల స్థలాలకు ఎలా ఇస్తారు? 28.02.2020

ఉపాధి పథకం కింద కేంద్ర పభుత్వం విడుదల చేసిన రూ 1134 కోట్లను ఎందుకు పంపిణీ చేయమని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది – 03.03.2020

ఫిబ్రవరి 27న విశాఖలో చంద్రబాబు పర్యటనను పోలీసులు అడ్డుకోవడంపై డీజీపీపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వండి , సెక్షన్ 151 కింద నోటీసులు ఎలా ఇస్తారు?– 03.03.2020

పేదల భూములు గుంజుకుంటారా? అసైన్డ్ భూముల్లో ఇళ్ల పట్టాలా? ఒకరి వద్ద తీసుకొని మరొకరికిస్తారా? – కెవిపిఎస్ రిట్ పై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు : 05.03.2020

రాజకీయ రంగులొద్దు, పంచాయితీ భవనాలకు వైకాపా జెండాను పోలిన రంగుల్ని తీసేయంది, పార్టీలతో సంబంధం లేని రంగు 10 రోజుల్లో వేయండి, ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశం. 11.03.2020

విశాఖలో చంద్రబాబు గారికి 151 సీఆర్పీసీ నోటీసు ఇవ్వడంపై హైకోర్టు సీరియస్. ఏ నిబంధన కింద సీఆర్పీసీ 151 అమలు చేశారో చెప్పాలని డీజీపీని ప్రశ్నించిన ధర్మాసనం. నోటీసు ఇచ్చిన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించిన హైకోర్టు. 12.03.2020

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ వైకాపా నేతలు వ్యవహరించాని సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేసినా.. వార్డు కార్యదర్శులు, వాలంటీర్లను వైకాపా ప్రచారం కోసం వినియోగిస్తున్నా రాష్ట్ర ఎన్నికల కమిషన్(ఎస్ఈసీ) పట్టించుకోకపోవడంపై హైకోర్టు సీరియస్. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై తక్షణం స్పందించకపోవడంపై అసహనం వ్యక్తం చేసిన ధర్మాసనం. 13.03.2020

ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన భూముల్ని ఇళ్ల స్థలాలకు ఇవ్వవద్దని హైకోర్టు ఆదేశం. సీఎస్‌ సహా పలువురికి నోటీసులు. – 17.03.2020

కర్నూలుకు కార్యాలయాల తరలింపు జీవోను నిలుపుదల చేసిన హైకోర్టు – విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ కార్యాలయాలకు జారీ చేసిన జీవో సస్పెన్షన్ – ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు – 20.03.2020

సుప్రీంకోర్టులోజగన్ సర్కారుకు మరో ఎదురుదెబ్బ – పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడంపై.. హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్దించిన సుప్రీంకోర్టు – రంగులు తొలగించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం – 23.03.2020

ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి జీవో కొట్టివేత – జీవో81, 85ను కొట్టివేసిన ఏపీ హైకోర్టు – 15.04.2020

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలోపు పంచాయతీ కార్యాలయాలకు రంగులను తొలగించాలని హైకోర్టు ఆదేశం – వైసీపీ రంగులను తొలగించడానికి మూడు వారాలు గడువు కోరిన ప్రభుత్వం – 20.04.2020

వలస కూలీల సమస్యపై సీపీఐ నేత రామకృష్ణ వేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ – విజయవాడ, గుంటూరు నగరాలు సహా రాష్ట్ర వ్యాప్తంగా చిక్కుకుపోయిన వలస కార్మికులను వెంటనే వారి స్వస్థలాలకు పంపేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం – ఏపీలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులకు ఈ సౌకర్యం కల్పించాలని హైకోర్టు ఆదేశం – వలస కార్మికులకు తగిన వసతి, ఆహారంతోపాటు రూ.10 వేలు ఆర్థిక సహాయం చేయాలన్న హైకోర్టు – 23.04.2020

ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలకు ఏపీ హైకోర్టు నోటీసులు – ఎమ్మెల్యేలు మధుసూదన్‍రెడ్డి, రోజా, సంజీవయ్య, వెంకటగౌడ, విడదల రజినికి నోటీసులు – కరోనా వ్యాప్తికి వైసీపీ నేతలు కారణమంటూ దాఖలైన పిటిషన్‍పై విచారణ – నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారో వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని డీజీపీ, ప్రభుత్వానికి ఆదేశం – 05.05.2020

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్ – పంచాయతీ భవనాలకు కొత్తరంగులు వేయాలని జీవో నెం.623 ఇచ్చిన ప్రభుత్వం – వైసీపీ రంగులతోపాటు మరో రంగును వేయాలని జీవో తెచ్చిన ప్రభుత్వం – జీవో నెం.623ను సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్టు – 05.05.2020

ఇంజినీరింగ్ కళాశాలల్లో ఫీజుల నియంత్రణపై ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.15 ను తాత్కాలికంగా సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్టు – 07.05.2020

వైసీపీ ఎమ్మెల్యేలు లాక్ డౌన్ ఉల్లంఘనపై హైకోర్టు ఆగ్రహం – విచారణకు ఎందుకు ఆదేశించకూడదన్న హైకోర్టు – ప్రజాప్రతినిధులే నిబంధనలు పట్టించుకోకపోతే ఎలా..? – 20.05.2020

పంచాయతీ కార్యాలయాల రంగుల వ్యవహారంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో 623ను సస్పెండ్ చేసిన హైకోర్టు – వైసీపీ జెండా రంగులే కనిపిస్తున్నాయన్న వాదనతో ఏకీభవించిన హైకోర్టు – 22.05.2020

డా.సుధాకర్ పై జరిగిన దౌర్జన్యంపై హైకోర్టు ఆగ్రహం – కేసును సీబీఐ విచారణకు ఆదేశం – విశాఖ పోలీసులపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని సీబీఐకి ఆదేశం – 8 వారాల్లోగా విచారణ పూర్తిచేసి నివేదిక ఇవ్వాలి – 22.05.2020

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ ఎత్తివేత – ఆయనను సస్పెండ్‌ చేస్తూ జారీ చేసిన జీవోను రద్దుచేసి, మొత్తం ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలని కోర్టు ఆదేశం – 22.05.2020

ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీ ప్రాంగణాన్ని సీజ్‌ చేసి ఉంచాలి. కంపెనీ లోనికి ఎవరినీ అనుమతించొద్దు. తమ అనుమతి లేకుండా కంపెనీ డైరెక్టర్లు దేశం విడిచి వెళ్లకూడదు, పాస్‌పోర్ట్‌లు అప్పగించాలి. 24.05.2020

రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని తొలగిస్తూ… కొత్త ఎన్నికల కమీషనర్ ని నియమించడాన్ని తప్పుబట్టింది. రమేష్ కుమార్ ని కొనసాగించాలని 213 ఆర్టికల్ ప్రకారం ఎస్ఈసి పై ఆర్డినెన్స్ తెచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని చెప్పింది. 29.05.2020

Read more RELATED
Recommended to you

Latest news