భ‌ట్టి విక్ర‌మార్క కౌంట‌ర్‌.. మంత్రి పువ్వాడ ఎన్‌కౌంట‌ర్‌.. న‌వ్వుకున్న జ‌నాలు

-

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌, ప్ర‌తి విమ‌ర్శ‌లు చాలా ఘాటుగా ఉంటాయి. ఛ‌లోక్తులుగా న‌వ్వుకుంటూ విమ‌ర్శ‌లు చేసుకోవ‌డం చాలా అరుదు. కానీ ఈ రోజు అలాంటి ఓ ఘ‌ట‌న చోటుచేసుకుది. ఖ‌మ్మం జిల్లాలోని మ‌ధిర నియోజ‌క‌వ‌ర్గ కేంద్ర‌లోని ఆస్ప‌త్రిలో కొత్త‌గా 20బెడ్ల‌తో కొవిడ్ ఐసోలేష‌న్ సెంట‌ర్ ను ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మానికి మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే భ‌ట్టి విక్ర‌మార్క హాజ‌ర‌య్యారు.

అయితే ముందుగా మాట్లాడిన భ‌ట్టి విక్ర‌మార్క ఆస్ప‌త్రిలో చాలా స‌మ‌స్య‌లున్నాయ‌ని, వాటిని ప‌రిష్క‌రించాల‌ని మంత్రిని కోరారు.

ఇక దీనికి స‌మాధానమిస్తూ.. మంత్రి పువ్వాడ ఛ‌లోక్తులు విసిరారు. గ‌త ప్ర‌భుత్వాల నుంచి వార‌స‌త్వంగా త‌మ‌కు ఈ స‌మ‌స్య‌లు వ‌చ్చాయ‌ని ప‌రోక్షంగా కాంగ్రెస్‌ను విమ‌ర్శించారు. దీంతో తాను మాట్లాడుతా అని మైక్ ఇవ్వాల‌ని మంత్రిని అడిగాడు భ‌ట్టి. అయితే మైక్ ఇవ్వ‌డం కుద‌ర‌ద‌ని, మీరు మాట్లాడాకే నేను మాట్లాడుతున్నానంటూ మంత్రి చెప్పారు. ఇది అసెంబ్లీ కాద‌ని అర్థం చేసుకోవాల‌ని న‌వ్వుతూ స‌మాధానం ఇచ్చారు. దీంతో అక్క‌డున్న వారంతా ఒక్క‌సారిగా న‌వ్వుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news