బ్రేకింగ్: పార్టీ మారే ఆలోచనలో భూమా కుటుంబం

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు కర్నూలు జిల్లా రాజకీయాలు తీవ్ర ఇబ్బంది గా మారాయి. రాజకీయంగా ఇప్పుడు అక్కడ పార్టీ బలపదాల్సి ఉన్నా సరే కొన్ని కొన్ని వివాదాలు పార్టీని బాగా ఇబ్బంది పెడుతున్నాయి. అఖిల ప్రియ తనను చంపడానికి గానూ ప్రయత్నాలు చేస్తుందని ఏవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. ఆమె భర్త భరత్ తో పాటుగా ఆమెను కూడా అదుపులోకి తీసుకోవాలి అని ఆయన డిమాండ్ చేసారు. మళ్ళీ ఫ్యాక్షన్ మొదలవుతుంది అంటూ ఆవేదన వ్యక్తం చేసారు.

ఇక దీనిపై అఖిల ప్రియ కూడా అదే స్థాయిలో స్పందించారు. నిన్న రెండు వర్గాలు కూడా ఎదురు పడ్డాయి. దీనితో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ఎం జరుగుతుంది ఏంటీ అనేది కాసేపు ఎవరికి అర్ధం కాలేదు. అయితే ఇక్కడ అఖిల ప్రియ అసహనంగా ఉంది అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఆమె పార్టీ మారే అవకాశం ఉందని పలువురు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏవీ ఆ స్థాయిలో తనను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నా సరే చంద్రబాబు నుంచి మాత్రం ఏ స్పందన కూడా రావడం లేదని ఆమె ఆవేదనగా ఉన్నారట.

తనకు పార్టీలో ముందు నుంచి గుర్తింపు సరిగా లేదని ప్రాధాన్యత లేని మంత్రి పదవి ఇచ్చారు అని దానితో తాను నష్టపోవడం మినహా తనకు వచ్చింది ఏమీ లేదని ఆమె చెప్తుంది. ఇప్పుడు ఏవీ అన్ని వ్యాఖ్యలు చేస్తున్నా పార్టీ అధిష్టానం ఎందుకు స్పందించడం లేదని ఆమె అసహనం వ్యక్తం చేస్తుంది. ఈ వివాదంపై చంద్రబాబు స్పందించి త్వరగా ముగింపు కార్డు వెయ్యాలి అని ఆమె విజ్ఞప్తి చేస్తుంది. లేకపోతే మాత్రం తన దారి తాను చూసుకోవడం ఖాయం అనేది ఆమె చెప్తున్న మాట… మరి ఏమవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news