బ్రేకింగ్ : చంద్రబాబు ఇంటి ముందు టీడీపీ నేతల ఆందోళన..!?

-

గత కొంతకాలం నుంచి టీడీపీ నేతల్లో తీవ్ర అసంతృప్తి తెరమీదికి వస్తున్న విషయం తెలిసిందే. ఎంతో మంది టీడీపీ నేతలు సొంత పార్టీ పైన పలు ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి టిడిపి అధినేత చంద్రబాబుపై పలు ఆరోపణలు చేస్తూ సొంత పార్టీకి చెందిన నేత ఆయన ఇంటి ముందు ఆందోళనకు దిగారు. వెంకటేశ్వరరావు అనే టిడిపి నాయకుడు తాజాగా చంద్రబాబు ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనను ఏకంగా 30 ఏళ్లపాటు రాజకీయంగా వాడుకొని వదిలేశాడని ఆరోపించారు టిడిపి నేత వెంకటేశ్వరరావు.

గతంలో వెంకటేశ్వరరావు జూబ్లీహిల్స్ కార్పొరేటర్ గా పోటీ చేసి ఓడిపోయారు. ఈ నేపథ్యంలో కనీసం తన సమస్యలను కూడా చెప్పుకోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కొంచెం సమయం కూడా ఇవ్వడం లేదని … 30 సంవత్సరాల పాటు రాజకీయంగా వాడుకుని ప్రస్తుతం పట్టించుకోవడం మానేసారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే చంద్రబాబు ఇంటి ముందు బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు టిడిపి నేత వెంకటేశ్వరరావు. అయితే టీడీపీ నేత అయ్యుండి కూడా చంద్రబాబు ఇంటి ముందు ధర్నా చేయడం ప్రస్తుతం మరింత చర్చనీయాంశంగా మారిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news