చంద్ర‌బాబు ఏడాదికి ల‌క్ష‌కోట్లు దోచేశారు: విజ‌య‌సాయిరెడ్డి

-

విశాఖ: ఏపీ ముఖ్యంత్రి చంద్రబాబు నాయుడు ఏపీని నిలువునా దోచేశార‌ని, ఆయ‌న అతిపెద్ద గ‌జ‌ దొంగ అని, నాలుగ‌న్న‌ర ఏళ్ల పాల‌న‌లో నాలుగున్నర లక్షల కోట్లు దోచుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. సోమవారం విశాఖలో వైసీపీ సమన్వయకర్తలతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే చంద్రబాబు దేశం విడిచి వెళ్లిపోవాలని చూస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు, లోకేష్ దేశం విడిచి వెళ్ళకుండా… కేంద్రం పాస్‌పోర్టు రద్దు చేయాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version