పథకాల్లేవ్…ఏమీ లేవు-సంచలనంగా మారిన చంద్రబాబు ఆడియో

-

ఇప్పుడు జరిగే ఎన్నికల్లో తనను గెలిపిస్తే జగన్ కంటే ఎక్కువ సంఖ్యలో పథకాలను అమలు చేస్తానని నిన్నటి వరకు జరిగిన ప్రచార సభల్లో చంద్రబాబు నాయుడు చెప్పిన సంగతి తెలిసిందే.కానీ ఆయన ప్రజలకు ఏమీ చేయలేరని మరోసారి రుజువైంది.దీనికి సంబంధించిన ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభివృద్ధి అంతా అమరావతిలోనే ఉంటుందని ఆ ఆడియోలో ఉంది. పధకాలు లేవు…ఏమీ లేవు అంటూ చంద్రబాబుకి సంబంధించిన ఆడియో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. సీఎంగా 14 సంవత్సరాల అనుభవం ఉన్నా ఆయన సంక్షేమం గురించి ఏరోజు ఆలోచించలేదనేది ఈ ఆడియో ద్వారా అర్థం చేసుకోవచ్చు.

ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్న చంద్రబాబు నాయుడు సంచలన ఆడియో హాట్ టాపిక్ అవుతోంది. వైరల్ అవుతున్న చంద్రబాబు ఆడియోలో ఆయన పథకాల్లేవ్ ఏం లేవ్ మొత్తం బడ్జెట్ ను అమరావతికి కుమ్మరిస్తామని చెప్పుకొచ్చారు. మా ఆస్తులు కూడా ఇక్కడే ఉన్నాయని త్వరలో మీకు లాభాలు చూపిస్తానని బాబు కామెంట్లు చేసిన ఆడియో సోషల్ మీడియాలోకి వచ్చింది.మరోసారి ప్రజలను, నమ్మిన ఓటర్లను మోసం చేసి అధికారంలోకి రావాలనేది చంద్రబాబు ఆలోచన. బాబు ఇంతలా మోసం చేస్తారని అస్సలు ఊహించలేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

చంద్రబాబు నాయుడు మళ్లీ సీఎం కావడం కల్ల అని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు కూడా వస్తున్నాయి. ఈ ఆడియోను విన్న వాళ్లు ఈ వాయిస్ బాబుదేనని ఈ విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదని చెబుతున్నారు. పథకాల్లేవ్ ఏం లేవ్ అంటూ చంద్రబాబు చెప్పడంతో బాబు మాటలు, హామీలు నీటి మీద రాతలు అని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.గెలుపు తనదే అంటున్న బాబుకు ఈ ఎన్నికలు భారీ షాకులు ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది.అయితే ఈ ఆడియో పై అటు టీడీపీ శ్రేణులు కూడా స్పందిస్తున్నారు. అది ఫేక్ ఆడియో అని కొట్టిపారేస్తున్నారు. దీనిపై వైసీపీ కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు.ఎన్డీయే కూటమి గెలుపు తథ్యమని సర్వేలు వస్తున్న నేపధ్యంలో వైసీపీ ఇలాంటి బురదజల్లే కార్యక్రమాలు చేస్తోందని మండిపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news