అది నా అదృష్టం , వారికి మంచి జరగాలి: సిఎం జగన్

-

ఏపీ సిఎం వైఎస్ జగన్ మరో కార్యక్రమం మొదలుపెట్టారు. వైఎస్సార్ చేయూత అనే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. దీని ద్వారా 25 లక్షల మంది మహిళలకు లబ్ది చేకూరుతుంది. ఈ పథకం కోసం గానూ 4700 రూపాయలను ఏపీ ప్రభుత్వం కేటాయించింది. దీని ద్వారా ఔత్సాహిక వ్యాపారస్తులుగా మహిళలకు అండగా ఉంటుంది ఏపీ సర్కార్. ఈ కార్యక్రమం సందర్భంగా సిఎం జగన్ మాట్లాడారు.

45 నుంచి 60 ఏళ్ళ లోపు మహిళలకు ఏ సంక్షేమ కార్యక్రమం లేదు అని, అందుకే వారికి ఈ పథకం అందిస్తున్నామని చెప్పారు జగన్. ఇది తన అదృష్టంగా భావిస్తున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. వైఎస్సార్ చేయూత ద్వారా వారి కుటుంబాలకు మంచి జరగాలని అన్నారు. వారి కుటుంబాలకు అన్ని విధాలుగా తోడుగా నిలుస్తామని ఏపీ సర్కార్ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news