దేవినేని వారసుడికి జగన్ మరో పదవి…!

-

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అధికార వైసీపీ నేతలు బలపడటానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నారు. 150 స్థానాలు ఉన్నా సరే ఎక్కడా కూడా విపక్షాలకు అవకాశం ఉండకూడదు అని భావిస్తున్న సిఎం వైఎస్ జగన్… యువతకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి అని భావిస్తున్నారు. యువ నేతలకు ఎక్కువగా ప్రోత్సాహం అందిస్తున్నారు ఆయన. యువనేతలను దగ్గర తీసుకుని మాట్లాడటం సహా వారి సమస్యలను ఆయన స్వయంగా తీర్చే ప్రయత్నాలు కూడా ఎక్కువగానే చేస్తున్నారు.

తాజాగా ఆయన విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్, విజయవాడ యువనేత దేవినేని అవినాష్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం. యువతలో ఆయనకు ఉన్న ఫాలోయింగ్ ని దృష్టి లో పెట్టుకుని జగన్… ఆయనకు కృష్ణా జిల్లా అధ్యక్ష బాధ్యతలను అప్పగించే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. అవినాష్ లో సమర్ధత ఉందని దీనికి గుడివాడ ఎమ్మెల్యే, మంత్రి కొడాలి నానీ కూడా మద్దతు ఇచ్చారని, అవినాష్ కి యూత్ లో ఫాలోయింగ్ ఉండటమే కాకుండా ఆర్ధికంగా బలంగా ఉన్న వ్యక్తి అని,

ఆయనకు అవకాశం ఇస్తే సామాజిక వర్గం పరంగా కూడా మంచి బలం వచ్చినట్టు ఉంటుందని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. జగన్ కూడా దాదాపుగా ఇదే అభిప్రాయం తో ఉన్నారని సమాచారం. రాజకీయంగా కృష్ణా జిల్లా చాలా కీలకం. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కమ్మ సామాజిక వర్గ ఓటు బ్యాంకు ఉంది. దీనితోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని, పార్టీకి ఇది లాభించే అవకాశాలు ఉంటాయని ఈ నిర్ణయం తీసుకున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. త్వరలోనే ఈ నిర్ణయం ప్రకటించే సూచనలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news