28 మంది ఎంపీలు ఉన్నా… జగన్ సాధించలేకపోయారా…?

-

పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి ఇప్పుడు అధికార పార్టీ టార్గెట్ గా విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. పోలవరానికి కేంద్రం నిధులు ఇవ్వడం లేదు అని ప్రకటన వచ్చిన తర్వాత అధికార పార్టీ టార్గెట్ గా మండిపడుతున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా ఘాటు వ్యాఖ్యలు చేసారు. ప్రోజెక్ట్ లో 10,473 కోట్లు, భూ సేకరణ, పునరావాసం కోసం 6,200 కోట్లు మొత్తం పోలవరంలో 16,673 కోట్ల పనులు జరిగాయి అని అన్నారు.

చంద్రబాబు నాయుడు 11,537 కోట్ల పనులు చేశారు అని ఆయన తెలిపారు. 70 శాతం పైగా పూర్తయిన ప్రాజెక్టులో 17 నెలలలో మీరు ఎంత పని చేశారు? ని ఆయన ప్రశ్నించారు. 28 మంది ఎంపిలుండి తెలుగుదేశం పార్టీ ఖర్చు పెట్టిన 4810 కోట్లు తెచ్చుకోలేకపోవడం మీ అసమర్థత కాదా? వైఎస్ జగన్ గారూ అని ఆయన ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news