వివేకానంద రెడ్డి ఇంట్లో కుక్కకు విషం పెట్టి చంపింది ఎవరు…?

-

టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా కీలక వ్యాఖ్యలు చేసారు. దేవినేని ఉమామహేశ్వరరావు ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ రోజు, రేపు అమావాస్య అందుకే నాపై కేసు పెట్టారని అన్నారు. ప్రతి అమావాస్యకు కేసులు. అలా ఈ ప్రభుత్వం ఉదృతంగా పని చేస్తోంది అని ఆరోపించారు. తిరుపతి ని అవమానిస్తు జగన్ మాట్లాడిన మాటలను వీడియోను బయటపెట్టినందుకు నాపై తప్పుడు కేసు పెట్టారు అని మండిపడ్డారు.

ఇది చెల్లుబాటు అయ్యే కేసుకాదు. తప్పుడు కేసులు భయపడేది లేదు అని ఆయన స్పష్టం చేసారు. 505 సెక్షన్ ఎలా అప్లై అవుతుంది? ఇది రెండు గ్రూప్ ల మధ్య గొడవ కాదు అని అన్నారు. కత్తిపోటు తో చనిపోతే గుండె పోటు అని చెప్పిన విజయసాయిరెడ్డి పైన పెట్టాలి కేసు అని, వివేకానంద ఇంట్లో కుక్కకు విషం పెట్టి ఎవరు చంపారో వారిపైనే పెట్టు కేసు అంటూ వ్యాఖ్యలు చేసారు.

బాబాయ్ రక్తాన్ని తుడిచిన వారిపైనే కేసు పెట్టు అని సూచించారు. పక్క రాష్ట్రాలతో కుమ్ముకు అయి, నీటి వాటాలో ఆంద్రప్రదేశ్ కి ద్రోహం చేశారు అని, రాయసీమ రైతాంగానికి ఉరితాడు పడింది. హక్కులు కోల్పోయామని అన్నారు. మోడీ, మమత, స్టాలిన్ ఇలా అందరూ ఎన్నికలు సభలు నిర్వహిస్తున్నారు అని జగన్ కు మాత్రం కరోన భయం అంట అంటూ ఎద్దేవా చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news