గ‌వ‌ర్న‌ర్ రాజకీయాలు చేయొద్దు : త‌మిళిసై పై ఆర్. కృష్ణయ్య సంచ‌ల‌నం

-

తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై సౌంద‌ర రాజ‌న్ పై బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణ‌య్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఒక రాష్ట్రానికి గ‌వ‌ర్న‌ర్ ప‌దవిలో ఉన్నప్పుడు.. గ‌వ‌ర్న‌ర్ లాగే వ్య‌వ‌హ‌రించాల‌ని అన్నారు. గ‌వ‌ర్నర్.. రాజ‌కీయాలు చేయొద్దంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగ‌ రాష్ట్ర ప్ర‌భుత్వం, గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై సౌంద‌ర రాజ‌న్ మ‌ధ్య జ‌రుగుతున్న వివాదంపై ఆర్. కృష్ణ‌య్య మీడియాతో స్పందించారు.

గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై సౌంద‌ర రాజ‌న్.. బీసీ అయిన‌ప్ప‌టికీ త‌మ‌కు మాట్లాడ‌టానికి ఇష్టప‌డ‌ర‌ని అన్నారు. త‌మ‌కు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వ‌ద‌ని విమ‌ర్శించారు. రాజ్యాంగబ‌ద్ధ‌మైన ప‌ద‌విలో ఉన్న‌ప్పుడు.. ఇష్టం లేకున్నా.. అందరినీ క‌ల‌వాల‌ని అన్నారు. కానీ గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై అలా కాకుండా.. కొంత మందిని మాత్ర‌మే క‌లుస్తానంటూ వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని మండిప‌డ్డారు. త‌మ పార్టీలు వాళ్లు చెబితేనే క‌లుస్తానంటూ గ‌వ‌ర్నర్ అనడం స‌రి కాద‌ని అన్నారు. స‌మ‌స్య‌లు ఉంటే.. గ‌వ‌ర్న‌ర్ స్పందించాల‌ని అన్నారు. అంతే కాని రాజ‌కీయా కోణం వెళ్ల‌కూడాద‌ని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news