ఐటీ రైడ్స్‌కు టీడీపీ ఎందుకు ఉలిక్కిపడుతుందో అర్థం కావట్లేదు: పవన్‌కల్యాణ్

-

విజయవాడ: వ్యాపారస్తుల మీద ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతున్నది. కానీ.. ఐటీ రైడ్స్ అనేసరికి టీడీపీ ఎందుకు ఉలిక్కిపడుతుందో అర్థం కావట్లేదు.. అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే ఆలోచనలో తలామునకలైనట్లు తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాల తర్వాత రాయలసీమ టూర్ ఉంటుందన్నారు. అన్ని నియోజకవర్గాల మీద సమానమైన దృష్టి జనసేన పార్టీకి ఉందన్నారు. 2019 ఎన్నికల్లో జనసేన ఏపీలో 175 స్థానాల్లో కచ్చితంగా పోటీ చేస్తుందని.. అందులో ఎటువంటి అనుమానం లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news