ధ‌ర్మ‌పురికి అలాంటి పేరు పెట్టేస్తున్న జీవ‌న్‌రెడ్డి.. ఈ సారి మరింత ఘాటుగా..

-

తెలంగాణలో అధికార గులాబీ పార్టీ తామే ప్రత్యామ్నాయమంటూ కమలనాథులు పేర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ పార్టీ విధానాలను ఎండగట్టే ప్రయత్నం చేస్తుంటారు. టీవీ డిబేట్స్, ప్రజా క్షేత్రంలో బీజేపీకి చెందిన నేతలు ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తుంటారు. బీజేపీ స్టేట్ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్, ఇందూరు ఎంపీ ధర్మపురి అర్వింద్, దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు స్ట్రాంగ్ కౌంటర్స్ ఇస్తుంటారు. కాగా, బీజేపీ పార్టీపై, ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై టీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ లీడర్ జీవన్‌రెడ్డి పలు విమర్శలు చేశారు.

jeevan reddy
అయితే, జీవన్‌రెడ్డి ప్రతీ సారి ఆచి తూచి విమర్శలు చేస్తుండేవాడు. కానీ, ఈ సారి ఓ అడుగు ముందుకేసి ఘాటు విమర్శలు చేశాడు. బీజేపీ అంటే బిగ్ జోకర్స్ పార్టీగా మారిపోయింద‌ని, తన జిల్లాకు చెందిన ఎంపీ అర్వింద్ బిగ్ లోఫర్ అంటూ తీవ్రస్థాయిలో మండి పడ్డారు. ఇలాంటి విమర్శలు గతంలో ఆయన ఎన్నడు చేయలేదు. ఈ క్రమంలోనే బీజేపీ నేతలకు కేసీఆర్, కేటీఆర్ గురించి మాట్లాడే అర్హత లేదని ఆరోపించారు. ఎన్నికల సమయంలో పసుపు బోర్డు తెస్తానంటూ ఎంపీ ధర్మపురి అర్వింద్ నకిలీ బాండ్ పేపర్ రాసిచ్చారంటూ దుయ్యబట్టారు.

రైతులను మోసం చేసిన అర్వింద్ ఫేక్ ఎంపీ అంటూ విమర్శించారు. కాగా, ఒక ఎంపీని పట్టుకుని లోఫర్ అనడమేంటని బీజేపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. జీవన్ రెడ్డికి ఉన్న సంస్కారం అది అంటూ కమలం పార్టీ కార్యకర్తలు అంటు్నారు. సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు అదే టాపిక్‌పై చర్చ నడుస్తున్నది. జీవన్‌రెడ్డి వ్యాఖ్యలకు కమలనాథులు, సదరు ఎంపీ ఏ విధంగా కౌంటర్ ఇస్తారో చూడాలి మరి..

Read more RELATED
Recommended to you

Latest news