బిజేపీ వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేస్తోంది :డిప్యూటీ సీఎం

-

Krishnamurthy Fire on BJP

విజయవాడ: బీజేపీ ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తోందని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఆరోపించారు. స‌చివాల‌యంలో కేఈ మీడియాతో మాట్లాడారు. దేశంలో సంక్షోభ పరిస్థితులు ఎదురైన ప్రతిసారీ జాతీయ రాజకీయాల్లో టీడీపీ క్రియాశీల పాత్ర పోషించిందన్నారు. దేశంలో నియంతృత్వ పోకడలు కన్పిస్తున్నాయని, ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్‌ కన్నా బీజేపీ వల్లే దేశానికి ప్రమాదమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. టీడీపీ విధానాలకు, ఎన్టీఆర్‌ సిద్ధాంతాలకు వక్రభాష్యం చెప్పడం మానుకోవాలని కేఈ సూచించారు. బీజేపీ కక్షగట్టి సీఎం చంద్రబాబు కీర్తిప్రతిష్ఠలు దిగజార్చాలని చూస్తోందని, బీజేపీకి తెలుగు ప్రజలు సరైన సమయంలో బుద్ధి చెప్తారని కేఈ కృష్ణమూర్తి హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news