బావా మళ్లీ కుదరకపోవచ్చు.. హరీశ్ రావుతో కేటీఆర్

-

చాలారోజుల నుంచి హరీశ్ రావు పార్టీతో అంటిముట్టనట్టుగా ఉంటున్నారని వస్తున్న వార్తలకు ఈరోజు చెక్ పెట్టినట్టయింది. కేటీఆర్, హరీశ్‌రావు ఇద్దరు భూమి పూజ జరుగుతుండగా.. సరదా ముచ్చటిస్తూ అంతా కలియతిరిగారు. సరదాగా కాసేపు కబుర్లు చెప్పుకున్నారు.

ఇవాళ తెలంగాణ కొత్త సచివాలయం, అసెంబ్లీ భవనాలకు సీఎం కేసీఆర్ భూమి పూజ చేశారు కదా. అక్కడ ఓ సరదా ఘటన చోటు చేసుకున్నది. సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య ఈ ఫన్నీ ఘటన చోటు చేసుకున్నది. అన్నట్టు ఇవాళ జరిగిన భూమి పూజ కార్యక్రమానికి హరీశ్ రావు కూడా వచ్చారు.

ఆ సమయంలోనే వాళ్లిద్దరు కాసేపు ముచ్చటించారు. ఈసందర్భంగా వాళ్లిద్దరి మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. బావా.. మళ్లీ కుదరదేమో.. ఒకసారి మన పాత చాంబర్లు చూసుకుందాం పదా.. అని హరీశ్ రావుతో కేటీఆర్ అన్నారు. ఆ మాటకు హరీశ్ కాసేపు నవ్వారు. తర్వాత కార్యకర్తలతో ఇద్దరూ సెల్ఫీలు దిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

చాలారోజుల నుంచి హరీశ్ రావు పార్టీతో అంటిముట్టనట్టుగా ఉంటున్నారని వస్తున్న వార్తలకు ఈరోజు చెక్ పెట్టినట్టయింది. కేటీఆర్, హరీశ్‌రావు ఇద్దరు భూమి పూజ జరుగుతుండగా.. సరదా ముచ్చటిస్తూ అంతా కలియతిరిగారు. సరదాగా కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. దీంతో టీఆర్‌ఎస్ పార్టీ, హరీశ్ రావుకు మధ్య ఉన్న గ్యాప్ తగ్గినట్టేనని.. ఇక నుంచి హరీశ్ కూడా అన్ని పనుల్లో చురుకుగా పాల్గొంటారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news