ఎమ్మెల్సీ కవిత రాజీనామా చేసి విచారణకు హాజరవ్వాలి : మధుయాస్కీ

-

దిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మల్సీ కవిత ప్రెస్ మీట్ పై కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీ స్పందించారు. తప్పుడు ఆరోపణలంటున్న కవిత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి విచారణకు సహకరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పాటు సమయంలోనూ.. కేటీఆర్‌, కవితపై ఆరోపణలు వస్తే చర్యలు తీసుకుంటామన్నారని తెలిపారు.కేసీఆర్‌కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కవితతో రాజీమానా చేయించాలని డిమాండ్ చేశారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.

కవితకు నిజాయితీ ఉంటే భాజపా నేతలపై పరువునష్టం కేసు వేయాలి. కేసీఆర్‌ కుటుంబంపై కేంద్రం ఈడీ, సీబీఐ సంస్థలతో దర్యాప్తు జరిపించాలి. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే కవితతో రాజీమానా చేయించాలి. ఎమ్మెల్సీ కవిత మరోసారి ఉద్యమ ముసుగులో తప్పించుకోవాలని చూస్తున్నారు. కవిత ఎంపీగా ఉన్న సమయంలో విభజన హామీలపై పోరాటం చేశారా?- మధుయాస్కీ, కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్

నిజామాబాద్‌లో ప్రేమసాగర్‌ అనే వ్యక్తి వెలమ అసోసియేషన్‌కు రూ.కోటి ఎక్కడి నుంచి ఇచ్చారని మధుయాష్కీ ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కవిత మరోసారి ఉద్యమ ముసుగులో తప్పించుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. కవిత ఎంపీగా ఉన్న సమయంలో విభజన హామీలపై పోరాటం చేశారా? అని మధుయాస్కీ నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news