రేవంత్‌రెడ్డి ని చెప్పుల‌తో కొడ‌తామ‌న్న ఎమ్మెల్యేలు.. భ‌య‌మా లేక జాగ్ర‌త్తా..?

-

మొద‌టి నుంచి ఫైర్ బ్రాండ్‌గా పేరున్నరేవంత్‌రెడ్డి (revanth reddy) ఇలా కాంగ్రెస్ అధ్య‌క్షుడు కాగానే వ‌రుసగ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి టీఆర్ ఎస్‌లో చేరిన వారిపై కూడా మాట‌ల తూటాలు పేల్చారు. కాంగ్రెస్‌లో గెలిచి పార్టీ మారిన వారిని రాళ్ల‌తో కొట్టి చంపాల‌ని రీసెంట్‌గా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు క‌ల్లోలం రేపుతున్నాయి. ఇక ఇదే వ్యాఖ్య‌ల‌పై ఫిరాయింపు ఎమ్మెల్యేలు కూడా స్పందిస్తున్నారు.

రేవంత్‌రెడ్డి/ revanth reddy
రేవంత్‌రెడ్డి/ revanth reddy

టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అయిన సుధీర్‌రెడ్డి అలాగే గండ్ర వెంకటరమణరెడ్డి ఇద్ద‌రూ ఈరోజు స్పందిస్తూ తాము న్యాయ ప‌రంగానే టీఆర్ ఎస్‌లో చేరామ‌ని, హ‌ద్దులు దాట‌లేద‌ని చెప్పారు. ఇక రేవంత్ త‌మ‌ను రాళ్ల‌తో కొట్టాల‌ని అన్నాడ‌ని, తాము కూడా రేవంత్‌ను చెప్పుల‌తో కొడ‌తామ‌ని హెచ్చరించారు.

అయితే వీరిద్ద‌రూ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. రేవంత్‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోని టీఆర్ ఎస్‌లో ఉన్న ఈ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఆయ‌న ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబులు కూడా చెప్ప‌డం విడ్డూరంగా ఉంది. అయితే వీరంతా కేసీఆర్ మెప్పుకోస‌మే ఇలా చేశార‌ని కూడా తెలుస్తోంది. ఇంకోవైపు ముందు జాగ్ర‌త్తగా రేవంత్‌ను అదుపులో ఉంచేందుకు ఇలా మాట్లాడ‌ర‌నే టాక్ వినిపిస్తోంది. మ‌రి రేవంత్ వీరి వ్యాఖ్య‌ల‌పై ఎలా స్పందిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news