అల్లుడ్ని కుర్చీ దించేందుకు మామ కుట్ర..? : ఎంపీ రామ్మోహన్ సంచలన వ్యాఖ్యలు..!

-

ఏపీ టీడీపీ అధ్యక్షుడి మార్పు వ్యవహారంపై టీడీపీ, వైసీపీల మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం జరుగుతుంది. ఇటీవలే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబు, లోకేష్‌, ఎంపీ రామ్మోహన్‌నాయుడ్ని టార్గెట్ చేస్తూ.. ట్విట్టర్ వేదికగా విమర్శలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆయన విమర్శలు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపాయి. అయితే తాజాగా దీనిపై ఎంపీ రామ్మోహ‌న్ స్పందిస్తూ.. ఘాటు ట్వీట్‌తో విజయసాయికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘అల్లుడేమో అవినీతికి తిమ్మరాజు పనికి పోతురాజు.సీనియర్లు అందరూ చేతగానోడి పాలన చూసి ”ఛీ” కొడుతున్నారు. కారు దించేశారనే కక్షతో మమ అప్రూవర్గా మారి అల్లుడిని కుర్చీ నుండి దించేయాలని కుట్ర మొదలెట్టాడు. ప్రత్యేక హోదా పై చేతులెత్తేశారు,ఉత్తరాంధ్ర రైల్వే జోన్ పట్టాలెక్కించడం చేతకాలేదు.. మూడు ముక్కలాట మొదలెట్టి మూతి ముడుచుకొని కూర్చోవడం తప్ప ఏడాదిలో మామ, అల్లుడి వలన ఏ ప్రాంతానికి ఒరిగింది ఏమి లేదు. ఢిల్లీలో కాళ్లు మొక్కడం, ట్విట్టర్ లో రెచ్చిపోవడం మాని రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం పార్లమెంట్ లో కృషి చేస్తే ప్రజలు హర్షిస్తారు విజయసాయిరెడ్డి గారు’అంటూ మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news