హింసించే 24వ రాజు జగన్…!

-

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సిఎం వైఎస్ జగన్ పై తీవ్ర ఆరోపణలు చేసారు. అమరావతి ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ ఆయన సిఎం జగన్ టార్గెట్ గా విమర్శలు చేసారు. నేడు రాజధాని గ్రామాల్లో నారా లోకేష్ పర్యటిస్తున్నారు. జై అమరావతి ఉద్యమం మొదలై 300 రోజులైంది. హింసించే 24వ రాజు వైఎస్ జగన్ మాట మార్చి, మడమ తిప్పి నేటికి 300 రోజులు. అయింది అని ఆయన ట్వీట్ చేసారు.

lokesh
lokesh

అరెస్టులు, అవమానాలు, కేసులతో రాబందుల్లా వెంటాడుతున్నా ఎత్తిన జెండా దించకుండా జై అమరావతి అంటున్న రైతులు, మహిళలు, యువత, ఉద్యమకారులందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. మనస్సున్న వాడికి రైతు కష్టం తెలుస్తుంది. మూర్ఖుడికి హింసించడం మాత్రమే తెలుస్తుంది. మనం మూర్ఖుడితో పోరాటం చేస్తున్నాం. ఇదొక సుదీర్ఘ పోరాటం. ఓర్పు, సహనంతో ఉంటే అంతిమ విజయం మనదే.” అని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news