అసెంబ్లీలో కాంగ్రెస్ నుంచి మ‌ద్ద‌తు లేదు : కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమ‌టి రెడ్డి

-

అసెంబ్లీలో బడ్జెట్ పై మాట్లాడుతున్న స‌మ‌యంలో త‌న‌కు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల నుంచి మ‌ద్ద‌తు ల‌భించ‌డం లేద‌ని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమ‌టి రెడ్డి రాజ గోపాల్ రెడ్డి అసంతృప్తి వ్య‌క్తం చేశారు. త‌న‌పై అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆరోప‌ణ‌లు చేస్తున్నా… త‌న‌కు మ‌ద్ద‌తుగా త‌మ పార్టీ ఎమ్మెల్యేలు క‌నీసం స్పందించ లేద‌ని అన్నారు. కాగ సోమవారం బ‌డ్జెట్ ప‌ద్దుల‌పై చ‌ర్చ జ‌రుగుతున్న స‌మ‌యంలో ఆంధ్ర కాంట్రాక్ట‌ర్ల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం దోచి పెడుతుంద‌ని ఆరోపించారు.

Komatireddy Rajagopal Reddy | Munugode constituency MLA

కాగ ఈ వ్యాఖ్య‌ల‌పై మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్.. రాజ గోపాల్ రెడ్డి కూడా ఒక కాంట్రాక్ట‌ర్ అని.. అందుకే టీఆర్ఎస్ పై ఇలాంటి ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని అన్నారు. అయితే త‌నపై త‌ల‌సాని శ్రీ‌నువాస్ యాద‌వ్ ఆరోప‌ణ‌లు చేస్తున్నా.. త‌మ పార్టీ ఎమ్మెల్యే ఏ మాత్రం ప‌ట్టించుకోలేద‌ని అన్నారు. కాగ కాంగ్రెస్ ఎమ్మెల్యే లు త‌న‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డం లేద‌నే మంగ‌ళ వారం ఉద‌యం అసెంబ్లీ స‌మావేశాల‌కు హాజ‌రు కాలేద‌ని తెలిపారు. కానీ మ‌ధ్యాహ్నం అసెంబ్లీకి వ‌చ్చాన‌ని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news