ఏపీలో నేడు కొత్త‌గా 59 కరోనా కేసులు

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు త‌గ్గుముఖం పెట్టినా.. ఒక్క రోజు త‌గ్గ‌డం, మ‌రోక రోజు స్వ‌ల్పంగా పెర‌గ‌డం జ‌రుగుతుంది. ఆంధ్ర ప్ర‌దేశ్ లో గ‌త రెండు రోజుల్లో 50 కి త‌క్కువ‌గా క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి. కాగ నేడు స్వ‌ల్పంగా క‌రోనా కేసులు పెరిగాయి. కాగ నేటి క‌రోనా బులిటెన్ ను ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుద‌ల చేశారు. ఈ క‌రోనా బులిటెన్ ప్ర‌కారం.. గ‌డిచిన 24 గంట‌ల్లో ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 59 క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.

దీంతో ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 23,18,943 క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. కాగ గ‌డిచిన 24 గంట‌ల్లో ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 83 క‌రోనా వైర‌స్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా వైర‌స్ నుంచి 23,03,690 మంది క‌రోనా వైర‌స్ బాధితులు కోలుకున్నారు.

కాగ ఈ రోజు కూడా రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఎలాంటి మ‌ర‌ణాలు సంభ‌వించ‌లేదు. కాగ గ‌డిచిన 24 గంటల్లో ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు 10,914 మందికి క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షలు నిర్వ‌హించారు.

Read more RELATED
Recommended to you

Latest news