ఈ డిసెంబర్ లో అసెంబ్లీ రద్దు.. మార్చిలో ఎన్నికలు: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

తెలంగాణ పీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ఎన్నో రోజులు లేవని.. ఈ ఏడాది డిసెంబర్ లో కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేస్తారని… మార్చిలో ఎన్నికలకు వస్తాయని ఆయన అన్నారు. కేసీఆర్ ఆత్మహత్య చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడని… తొందర్లోనే కేసీఆర్ మెడకు తాడు కట్టుకుని ఫ్యాన్ కు వేలాడపడతాడని విమర్శించారు. కేసీఆర్ కు రోజులు దగ్గర పడ్డాయని ఆయన అన్నారు. రాష్ట్రంలో పేదల కష్టాలు తీర్చాల్సిన ఆయన దేశం అంతటా దేశ దిమ్మరిలా తిరుగుతున్నాడని.. చెట్టుమీద కోతిలాగా, కాలుకాలిన పిల్లిలా తిరుగుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో పరిపాలన చేయడం లేదని ఆయన అన్నారు. కేసీఆర్ కు టెంటు లేదు, ఫ్రంట్ లేదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదిలోగా రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ లాక్కున్న అసైన్డ్ భూములను తిరిగి తీసుకుంటామని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోెకి వచ్చిన తొలిరోజే ప్రగతి భవన్ ను అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ గా మారుస్తామని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news