చప్రాసిగా కూడా పనికిరావు.. కేటీఆర్ పై రేవంత్ రెడ్డి ఫైర్

-

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. సాగర హారం, సకల జనుల సమ్మె టీఆర్ఎస్ ఒక్కటే చేయలేదని మండిపడ్డారు. ఆ ఆందోళనలన్నీ కాంగ్రెస్ నేతృత్వంలో జరిగినవేనని గుర్తుచేశారు. తాను ఉద్యమంలో ఎక్కడున్నారో తన శాసనసభ రికార్డులు చూస్తే తెలుస్తుందని చెప్పారు. ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప కేటీఆర్ చేసిందేం లేదని మండిపడ్డారు. 610 జీవో అమలు చేస్తే కేటీఆర్ చప్రాసి పనికి కూడా పనికిరాడంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతకుముందు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై రేవంత్ మాట్లాడారు. ఈనెల 14న జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశిస్తుందని తెలిపారు. అక్టోబర్ 4న హస్తం అగ్రనేతలు దిగ్విజయ్ సింగ్, జైరాం రమేశ్ తెలంగాణ పర్యటనకు సంబంధించి సమీక్ష నిర్వహిస్తారని వెల్లడించారు. తెలంగాణ ఆకాంక్షలు,  సమస్యలపై రాహుల్ గాంధీ ఈ యాత్రలో మాట్లాడనున్నారని రేవంత్ చెప్పారు. 14 రోజుల జోడో యాత్ర రూట్ మ్యాప్ పై సూత్రప్రాయంగా నిర్ణయించామన్న రేవంత్ రెడ్డి,  యాత్ర సెక్యూరిటీకి సంబంధించి  డీజీపీని కలుస్తామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news