జగన్ ని అల్లరి చేస్తున్నారా…?

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని ఆయన అభిమానులే అల్లరి చేసే పరిస్థితి వచ్చిందా…? అంటే అవుననే సమాధానమే వినపడుతుంది. ప్రస్తుతం కరోనా వైరస్ నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలం అయింది అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. దీనికి జగన్ అలసత్వమే ప్రధాన కారణమని ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు అతి చేస్తున్నారట.

రాష్ట్రంలో కరోనా కట్టడి చర్యలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాని జగన్ మీడియా సమావేశం నిర్వహించడం లేదు. మీడియా సమావేశం కాస్తా ప్రజలను ఉద్దేశించి ప్రసంగం అయింది. దీనిపై విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నా సరే జగన్ మీడియా ప్రతినిధులతో ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నిస్తున్నారు.

కాని వైసీపీ కార్యకర్తలు మాత్రం జగన్ ప్రసంగంలో కొత్త అర్ధాలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఆయన్ను అల్లరి చేస్తున్నారు. జగన్ ప్రసంగం అనేది ఇప్పుడు చాలా అవసరం. మీడియాకు కూడా ఆయన సమాధానం చెప్పాల్సి ఉంది. కాని ఆయన చెప్పడం లేదు. అలాంటి విషయంలో కూడా వైసీపీ కార్యకర్తలు జగన్ ని కీర్తించడం, కొందరు మంత్రులు మాట్లాడే మాటలు ఇలా ప్రతీ ఒక్కటి కూడా వివాదాస్పదంగానే ఉన్నాయి. దీనిపై వాళ్ళు మారకపోతే జగన్ ఇబ్బంది పడతారు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news