బ్రేకింగ్: త్వరలో మరో మాజీ మంత్రి అరెస్ట్

-

టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈఎస్ఐ స్కాం లో 150 కోట్ల వరకు అవినీతి జరిగిందని అధికారులు గుర్తించారు. 988 కోట్ల కొనుగోలులో ఆయన 150 కోట్ల అవినీతికి పాల్పడ్డారు అని అధికారులు గుర్తించారు. ఒకే లెటర్ తో రెండు కంపెనీలకు నామినేషన్ వేసి టెండర్ విధానంలో కాకుండా నామినేషన్ విధానంలో కొనుగోలు చేసారు అని గుర్తించారు.

విజిలెన్స్ నివేదిక ఆధారంగా గుర్తించి ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 2014 19 మధ్య ఈ స్కాం జరిగింది అని అధికారులు గుర్తించారు. అవసరం లేకుండా కూడా ఆపరేషన్ చేసే పరికరాలను కొనుగోలు చేసారు అని అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు. ఇక ఆయనతో పాటుగా మరో మాజీ మంత్రిని కూడా అధికారులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది అని తెలుస్తుంది.

సదరు మాజీ మంత్రిది విశాఖ జిల్లా అని సమాచారం. ఆయనను కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని సమాచారం. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 16 వేల విలువ చేసే ఒక పరికరానని ఏకంగా 70 వేలకు కొనుగోలు చేసారు అని అధికారులు గుర్తించారు. ఇక మందులను కూడా అదే విధంగా కొన్నారు అని అధికారులు తమ నివేదికలో ఏసీబీ కి ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news