ఆ భ‌యం పట్టుకున్నప్పుడల్లా ఇలా బస్సు యాత్రలు చేస్తుంటాడు: విజయసాయిరెడ్డి విమ‌ర్శ‌ల వ‌ర్షం

-

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట‌ర్ వేదిక‌గా ఎప్ప‌క‌ప్పుడు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ప్ర‌స్తుతం చంద్రబాబు నాయుడు వైసీపీ పాలన విధానంఫై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. గడిచిన 9 నెలల్లోనే జగన్ అరాచక, అసమర్థ, అవినీతి పాలన గూర్చి ప్రజలకు తెలియజేసేందుకు ప్రజా చైతన్య యాత్ర చేప‌ట్టిన‌ సంగతి తెలిసిందే. మొత్తం 13 జిల్లాల్లో పర్యటించనున్న చంద్రబాబు దాదాపు 100 నియోజకవర్గాలకు పైగా సమస్యలని వివరించనున్నారు. అయితే దీనిపై తాజాగా.. గట్టిగా చప్పట్లు కొట్టి తనని ఉత్సాహపరచాలని 70 ఏళ్ల వయసులో చంద్రబాబు ప్రాధేయపడుతుంటే జాలేస్తుంది అని వైసీపీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు.

కార్యకర్తలు మరీ స్పందన లేకపోతె ఎలా? అడిగినందుకైనా కాసేపు క్లాప్స్ కొట్టొచ్చు కదా అంటూ సెటైర్లు వేసిన విజ‌యాస‌యిరెడ్డి మ‌రోసారి విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. అరెస్టు భయం పట్టుకున్నప్పుడల్లా దీక్షలు, బస్సు యాత్రలు ఏర్పాటు చేసుకుంటాడని ఆరోపించారు. “కార్యకర్తల మధ్యన ఉంటే తననెవరూ తాకలేరనే ధీమా అనుకుంటా. ఎమ్మెల్యేలను చుట్టు పెట్టుకుని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంటాడు. చేసిన తప్పులేమైనా సామాన్యమైనవా తప్పించుకోవడానికి!” అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news