ఎవ్వరూ తప్పించుకోలేరు ఉమా… మీ దోపిడీలన్నీ బయటికొస్తాయి..!

-

విజయసాయిరెడ్డి.. గత కొన్ని రోజులుగా తన ట్విట్టర్ లో గత ప్రభుత్వం టీడీపీ చేసిన అక్రమాలను వెలుగులోకి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా… చంద్రబాబు తన ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో చేసిన అక్రమాలపై విజయసాయిరెడ్డి ట్వీట్లతో విరుచుకుపడ్డారు.

పోలవరం పనుల అంచనాలను ఎలా తగ్గిస్తారో చెప్పాలని మాజీ మంత్రి ఉమా అనడం, దమ్ముంటే తనను పట్టుకోమని దొంగ పోలీసులకు సవాలు విసిరినట్టుగా ఉంది. అన్ని అనుమతులుండి, పనులు మొదలైన ప్రాజెక్టను ఐదేళ్లు ఏటీఎంలాగా వాడుకున్నారు. మీ దోపిడీలన్నీ బయటికొస్తాయి.. ఎవ్వరూ తప్పించుకోలేరు ఉమా.. అంటూ విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో ఏపీ మాజీ మంత్రి ఉమామహేశ్వరరావుపై ఫైర్ అయ్యారు.

విజయసాయిరెడ్డి.. గత కొన్ని రోజులుగా తన ట్విట్టర్ లో గత ప్రభుత్వం టీడీపీ చేసిన అక్రమాలను వెలుగులోకి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా… చంద్రబాబు తన ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో చేసిన అక్రమాలపై విజయసాయిరెడ్డి ట్వీట్లతో విరుచుకుపడ్డారు.

అంతే కాదు.. ప్రజావేదికపై కూడా విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ప్రజావేదిక ప్రభుత్వ నిధులతో నిర్మించిన సదుపాయం. చంద్రబాబు దానిని పార్టీ కార్యక్రమాలకు వాడుతున్నారు. ఓడిపోయినా తతన ఆక్రమణలోనే పెట్టుకున్నారు. కలెక్టర్ల కాన్ఫరెన్సుకు సిద్ధం చేస్తుంటే బాబు లేనప్పుడు తాళాలు తీస్తారా అంటూ ఆ పార్టీ నాయకులు సానుభూతి డ్రామాలాడటం పరువు తీసుకోవడమే.. అంటూ రెడ్డి ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news