జగన్ కొంప ముంచుతున్న నేతల బూతులు…!

-

ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ అయిన వైసీపీ నేతల నోటికి అద్దు అదుపు లేకుండా పోతుందనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. ప్రజల్లో మాట్లాడుతున్న సమయంలో మంత్రులు ఎమ్మెల్యేలు, చోటా మోటా లీడర్లు అందరూ కూడా నోటికి ఏది వస్తే అది మాట్లాడటం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. అసెంబ్లీ సమావేశాలు అయినా, బహిరంగ సమావేశాలు అయినా సరే వైసీపీ నేతల నోటి దురుసు,

వాళ్ళ వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి కొడాలి నానీ బూతు పురాణం అందుకోగా, ఆ తర్వాత స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా నోటి దూల ప్రదర్శించారు. ఆయన మాట్లాడిన మాటలపై ఇప్పటికి దుమారం రేగుతునే ఉంది. నాలుగు రోజుల క్రితం పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అనే వైసీపీ ఎమ్మెల్యే ఒకరు చంద్రబాబుపై అసభ్య పదజాల౦తో తీవ్ర వ్యాఖ్యలు చేసారు.

తాజాగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మరింత దూకుడు పెంచి వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. ఈ వ్యాఖ్యలు అన్నీ కూడా జగన్ కొంప ము౦చుతున్నాయి అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. వైసీపీ అభిమానులు కూడా ఒకానొక సమయంలో ఈ వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. న్యూట్రల్ ఓటర్లకు ఈ వ్యాఖ్యలు చికాకుగా మారాయి. వాళ్ళ పుణ్యమా అని జగన్ ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది.

Read more RELATED
Recommended to you

Latest news