జగన్ కు సంచలన లేఖ రాసిన వైసీపీ ఎంపీ…!

-

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరో లేఖ రాసారు. అయోధ్యలో ఆగష్టు 5 తేదీన జరిగే భూమి పూజ కార్యక్రమం రోజు రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని ఆయన కోరడం విశేషం. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆద్వర్యంలోని 24 వేల దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు , వేద పఠనం నిర్వహించాలని ఆయన కోరారు.

భూమి పూజ కార్యక్రమాన్ని టీటీడీ ఆద్వర్యంలోని ఎస్వీబీసీ ఛానల్ లో ప్రత్యక్ష ప్రసారం చెయ్యాలని ఆయన తన లేఖలో విజ్ఞప్తి చేసారు. అయోధ్యలో రామాలయం నిర్మాణానికి ప్రధాన మంత్రి మోడీ ఆగష్టు 5 వ తేదీ చేస్తున్న భూమి పూజ భారత దేశ చరిత్రలో ఒక మైలు రాయి అని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. ప్రజలు చిరకాల వాంఛ అయోధ్యలో రామాలయం నిర్మాణం అని ఆయన వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news