ఏపీ ప్రజలకు వైస్ జగన్ భార్య భారతి బహిరంగ లేఖ.. వాట్స‌ప్‌లో వైర‌ల్‌..!

-

జగన్‌కు దమ్ము ధైర్యం నీతి జాతి వంశపారపర్యంగా వచ్చినవి.. మీరు ఎన్ని కుతంత్రాలు కుట్రలు పన్నినా నవ్వుతూ ముందుకు సాగుతాడు. వీరుల పోరాటం అయితే నిజాయితీగా ఉంటుంది కానీ.. ఇక్కడ జగన్ ఒక్కడే వీరుడు.

ఏపీలో ఎన్నికలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. పోటీ ప్రధానంగా టీడీపీ, వైసీపీ మధ్యే అని తేలిపోయింది. ఇంకో 20 రోజుల్లో ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ భార్య భారతి ఏపీ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖ ప్ర‌స్తుతం వాట్స‌ప్ లో వైర‌ల్ అవుతోంది. అయితే.. ఈ లేఖ నిజంగా భార‌తి రాశారా? లేదా? అనేది తెలియ‌దు కానీ.. ఆ లేఖ మాత్రం నెటిజ‌న్ల‌ను బాగా ఆకర్షిస్తోంది. వాట్స‌ప్‌లో వైర‌ల్ అవుతున్న ఆ లేఖ య‌థాత‌థంగా ఆమె మాటల్లోనే చ‌ద‌వండి…

YS Bharathi open letter to AP people ahead of ap elections

ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు, వైఎస్సార్సీపీ అభిమానులకు నా మనసులోని భావాలు, ఆందోళన, భయాలు చెప్పటానికి ఫస్ట్ టైం మీడియా ముందుకు రావాల్సి వచ్చింది.

పొలిటికల్‌గా కానీ.. పర్సనల్‌గా కానీ ఎవ్వరినీ కామెంట్ చేయాలనే ఉద్దేశం నాకు లేదు. వైఎస్ జగన్ గెలిస్తే ఎవరికి ఏం చేస్తారు అని చెప్పడానికి కూడా నేను మీడియా ముందుకు రాలేదు. ఎవరు ఏ పథకాలను అమలు చేసినా.. అది వాళ్ల అబ్బ సొత్తు మాత్రం కాదు.. మీ సొమ్ము మీకే ఇస్తున్నారు. కానీ నాయకుడు సమన్యాయం, దూరదృష్టితో ఫలాలు అందరికీ అందేలా చేయాలి. అదే నాయకుడి లక్షణం.



ఒక్కటి మాత్రం చెప్పగలను.. ఒక మగాడి గుణగణాలను తల్లి తర్వాత కరెక్ట్‌గా చెప్పగలిగే వ్యక్తి భార్య మాత్రమే. వైఎస్ జగన్ భార్యగా నేను ఒకటి మాత్రం చెప్పగలను. ప్రతి అవ్వ తాతకు చేతికర్రలా, ప్రతి తల్లిదండ్రులకు పెద్ద కుమారుడిగా, ప్రతి ఆడపిల్లకు అన్నగా, పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా ప్రతి పేదవాడికి ప్రతిఫలాలు అందేలా మా మామ వైఎస్సార్‌లా చేస్తాడు అని చెప్పగలను.

నా మామ మరణించిన దగ్గర్నుంచి ఏపీలో జరుగుతున్న రాక్షస రాజకీయ క్రీడకు ఆందోళన చెందే నేను మీ ముందుకు వచ్చా. బహుశా రామాయణ భారతాలలో కూడా ఇన్ని కుట్రలు కుతంత్రాలు జరగలేదేమో కానీ తొమ్మిదేళ్లలో ఈ రాష్ట్రంలో జరిగాయి. జగన్ అనే ఒక వ్యక్తిని అణగదొక్కటానికి ఎవరు ఎలాంటి శిఖండి రాజకీయాలు చేశారో మీకు ఒక్కసారి గుర్తు చేయాలి.

వైఎస్ జగన్ ఇచ్చిన మాట కోసం ఏనాడూ వెనకడుగు వేయలేదు.. వేయడు కూడా. కాంగ్రెస్, టీడీపీ కలిసి కేసులు వేసి జేడీ లక్ష్మీనారాయణ ద్వారా ఆర్థికంగా, మానసికంగా దెబ్బకొట్టాలని చూశారు. అయినా కూడా ఏమాత్రం బెనకని దృఢమైన వ్యక్తిత్వం జగన్‌ది. ఆ వ్యక్తిత్వంతోనే వైఎస్ జగన్ ఒక శక్తిలా తనను తాను మలుచుకుంటూ ఎదిగారు. 2014లో ఏపీలో ఉన్న పెద్ద పెద్ద నాయకులంతా ఒకవైపు.. జగన్ ఒకవైపు అయినా స్వల్ప తేడాతో ప్రతిపక్షంలో కూర్చున్నాడు.

తొమ్మిదేళ్ల నుంచి అనునిత్యం ప్రజల కొరకు ప్రజల్లో ఒకడిగా ప్రజల్లో మమేకం అయ్యాడు జగన్. ఆయన ఏదీ దొడ్డి దారిలో సాధించాలని అనుకోడు. ఎవరు ఎన్ని అభాండాలు వేసినా చిరునవ్వుతో ముందుకు వెళ్లారు. ఒక వైపు చంద్రబాబు, మరో వైపు పవన్ కల్యాణ్.. అయినా ఎవ్వరికీ జగన్ లొంగలేదు. పవన్ కల్యాణ్ అంటే మంచి అభిప్రాయం ఉండేది. సినిమాల్లోలా బయట కూడా ఆయన స్ట్రయిట్‌ఫార్‌వర్డ్‌గా ఉంటారు అని అనుకున్నా. కానీ.. నా అభిప్రాయం తప్పని రీసెంట్‌గా తెలిసింది. అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వని మాయావతి ఇక్కడికి వచ్చి ఆయన్ను కలిసినప్పుడు దీని వెనుక ఏదో శికండి రాజకీయం ఉందని. పవన్ కల్యాణ్‌కు టీడీపీతో లోపాయకారి ఒప్పందాలు ఉన్నాయి. నాకు పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటం ఇష్టం లేదు. అలా మాట్లాడితే కొందరు ఆడపిల్లల జీవితాలను రోడ్డు మీద పెట్టినట్టు అవుతుంది. అది నాకు ఇష్టం లేదు.

ఎందుకంటే నేను ఒక ఆడదాన్ని. ఇద్దరు ఆడపిల్లలకు తల్లిని. జగన్‌కు దొంగ రాజకీయాలు తెలియదు.. యుద్ధం ముందు ఉండి చేసే టైపు. వెన్నుపోట్లు, అమ్ముడుపోవడాలు ఆయనకు తెలియదు. అందుకే 2014లో ఓడిపోయాం కావచ్చు. గత తొమ్మిది ఏళ్లుగా కుసంస్కారమైన కామెంట్స్ అన్నీ భరించాను. జగన్ వెన్నుపోటు పొడిచి ఎవరి పార్టీనీ లాక్కోలేదు. ఎవరికీ పార్టీని ప్యాకేజీలకు అమ్ముకోలేదు. అవినీతిపరుడని అంటున్నారు.. అధికారంలో ఉండి వాళ్లేమి పీకారు ఈ తొమ్మిదేళ్లు. చేతనైతే అభివృద్ధి చేసి నిరూపించండి. లేదా మూసుకొని కూర్చోండి. అన్యాయంగా కేసులు పెట్టారు. అయినా మాకు భయం లేదు. స్టేలు తెచ్చుకోలేదు. ధైర్యంగా ఎదుర్కొంటున్నాం. ఎవరి కాళ్లు పట్టుకోము మేము. ఒక మనిషి మీద దాడి జరిగితే నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయకుండా కోడికత్తి అంటున్నారు.. ఎగతాళి చేస్తున్నారు. నీ కొడుకుకో.. నీ మనవడికో దిగితే కోడికత్తి వల్ల ఏం జరుగుతుందో తెలిసేది చంద్రబాబు.

మా చిన్నమామను ఎవరో హత్య చేస్తే మా మీద బురద జల్లడం.. దోషులు ఎవరైనా శిక్ష పడటం కావాలి. అది బయటవాడు అయినా ఇంట్లో వాడు అయినా.. అందుకే సీబీఐ ఎంక్వయిరీ కోసం రిక్వెస్ట్ చేశాం. తండ్రిలాంటి మనిషిని పోగొట్టుకొని మేము బాధలో ఉంటే మీ పెంట రాజకీయాలు ఏంటి.. గ్రోఅప్ చంద్రబాబు.

బందిపోటు అని అంటున్నావు.. ఎస్.. జగన్ బందిపోటే. ప్రజల మనసులు దోచుకునే బందిపోటు. అందుకే నీకు గుండెపోటా? ఇలాంటి నీచ రాజకీయాలు ఇక చెల్లవు చంద్రబాబు.

జగన్‌కు దమ్ము ధైర్యం నీతి జాతి వంశపారపర్యంగా వచ్చినవి.. మీరు ఎన్ని కుతంత్రాలు కుట్రలు పన్నినా నవ్వుతూ ముందుకు సాగుతాడు. వీరుల పోరాటం అయితే నిజాయితీగా ఉంటుంది కానీ.. ఇక్కడ జగన్ ఒక్కడే వీరుడు. మిగిలిన వాళ్లు అందరూ ముసుగు దొంగలు.. వాళ్లు నెగ్గాలి అని యుద్ధం చేయటం లేదు. అందరూ కలిసి ఎలాగైనా జగన్‌ను ఓడించాలి అని పోటీ చేస్తున్నారు. జగన్ ముక్కు సూటిగా ముందుకు వెళ్లే టైపు. అదే నా భయం. ఈ దొంగలు చేసే అనైతిక యుద్ధంలో జగన్‌ను ఏమైనా చేస్తారేమో అని. ఇప్పటికే మా కుటుంబం చాలా నష్టపోయింది. ఇంకా తట్టుకునే శక్తి మాకు లేదు.

చంద్రబాబు అండ్ కో.. మీరు అధికారం కోసం జగన్‌కు ఏ హానీ చేయకండి. మీకు అలాంటి వెధవ ఆలోచనలు ఉంటే చెప్పండి. నేను మా ఆయనకు నచ్చ చెబుతా. ఇలాంటి వెధవలతో, నీచులతో రాజకీయాలు వద్దని చెబుతా. నేను ప్రజలను అడిగేది ఒక్కటే. నిజాయితీగా మీ మనఃసాక్షితో ఆలోచన చేయండి. ఎవరు నిజాయితీగా ఉన్నారు.. ఎవరు అవసరాన్ని బట్టి మాటలు మార్చుతున్నారో ఆలోచించండి. ప్రస్తుతం రాజకీయ వ్యవస్థ కుళ్లిపోయింది. దీని నవనాడుల్లో జవసత్వాలు పోయాయి. ఈవ్యవస్థను సరి చేయాలి అని ఒక దృఢమైన మనస్తత్వం ఉన్న, బలమైన సంకల్పం ఉన్న వైఎస్ జగన్ లాంటి నాయకుడు కావాలి. అందుకే నేను ప్రతి ఒక్క సోదరసోదరీమణులను కోరేది ఒక్కటే. మీ రాబోయే పాతికేళ్ల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. కుళ్లు కుతంత్రాలు చేసే నాయకులు కావాలో లేక కుళ్లిపోయిన ఈ వ్యవస్థలను సరిచేయడానికి యుద్ధం చేసే సైనికుడు లాంటి వైఎస్ జగన్ కావాలో మీరే నిర్ణయించుకోండి. మీ భవిష్యత్తు ఎవరి బాధ్యత కాదు.. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. నిర్ణేతలు మీరే.. అంటూ భారతి తన లేఖలో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news