వైఎస్ జగన్ కే ముచ్చెమటలు పట్టిస్తున్న వైకాపా లీడర్?

-

వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చి పది నెలలు కావస్తున్నా క్రమంలో మెల్ల మెల్లగా పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. విషయంలోకి వెళితే ఇటీవల వైసిపి పార్టీ అధికార ప్రతినిధి ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీలో పెయిడ్ ఆర్టిస్టులు ఎక్కువైపోయారు వాళ్లను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని లేకపోతే పార్టీ నాశనమైపోతుంది అని చేసిన కామెంట్లు వైసీపీలో కలకలం సృష్టించాయి. Image result for ys jagan annaఅంతేకాకుండా ఈ వ్యాఖ్యలు వైయస్ జగన్ కి ముచ్చెమటలు పట్టించినట్లు సమాచారం. కాగా ఇంత హఠాత్తుగా మహమ్మద్ ఇక్బాల్ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేసినవి అన్న దాని విషయంలో రకరకాల మాటలు పార్టీలో వినబడుతున్నాయి. ఎక్కువగా అయితే మాత్రం మంత్రి బొత్స సత్యనారాయణ అదేవిధంగా ఆనం రామనారాయణ రెడ్డి నీ ఉద్దేశించి ఇక్బాల్ వ్యాఖ్యలు చేసినట్లు పార్టీ లో టాక్.

 

విషయంలోకి వెళితే గతంలో బొత్సా సత్యానారాయణ పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నపుడు జగన్ గురించి, విజయమ్మ గురించి దారుణంగా విమర్శలు చేయడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎంఎల్ఏగా ఉన్న ఆనం రామనారాయణరెడ్డి కూడా జగన్ పై నోటికొచ్చినట్లు మాట్లాడటం జరిగింది. వీరిద్దరిని ఉద్దేశించే మహమ్మద్ ఇక్బాల్ వ్యాఖ్యలు చేసినట్లు పార్టీ వర్గాలు బలంగా నమ్ముతున్నారు. దీంతో సడన్ గా ఎటువంటి కారణం లేకుండా మహమ్మద్ ఇక్బాల్ ఈ వ్యాఖ్యలు చేయడంతో పార్టీలో అంతర్గత విభేదాలు తలెత్తుతాయమో అని అధ్యక్షుడు జగన్ కి చమట పట్టినట్లు పార్టీలో టాక్.

Read more RELATED
Recommended to you

Latest news