`పెప్పర్ గ్యాంగ్’ ను వీధుల్లోకి వదిలారు.. విజ‌య‌సాయిరెడ్డి హాట్ కామెంట్స్‌

-

ఏపీలో నవ యువ ముఖ్యమంత్రిగా జగన్ అవతరించినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ శ్రేణులు జగన్ తీసుకునే ఏ చిన్న నిర్ణయాన్ని కూడా వదలకుండా ఏకి పారేస్తూ వస్తున్న సంగ‌తి తెలిసిందే. అలా జగన్ తీసుకున్న రాజధాని తరలింపు అంశంపై ఏపీలో ఇంకా రచ్చ కొనసాగుతుంది. అయితే చంద్రబాబు మ‌రియు టీడీపీ మాత్రం రాజధానిని తరలించడానికి వీలు లేదని పట్టు పట్టి కూర్చున్నారు. ఇక తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై రాజ్య‌స‌భ స‌భ్యుడు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అమరావతి భూముల కోసం చంద్రబాబు అత్యంత నీచమైన చేష్టలకు తెగబడుతున్నారంటూ ఓ ట్వీట్ చేశారు. రాజధాని తరలించొద్దని పిలుపునిస్తే రాష్ట్ర మంతా అల్లకల్లోలమవుతుందని ఆయన అతిగా ఊహించుకున్నారని, ఎవరూ పట్టించుకోకపోవడంతో కారం చల్లే ‘పెప్పర్ గ్యాంగ్’ ను వీధుల్లోకి వదిలారని, వీళ్లంతా టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులే అని ధ్వజమెత్తారు. మరి విజయసాయి రెడ్డి చెప్పిన ఆ “పెప్పర్ బ్యాచ్” ఎవరిని ఉద్దేశించి అన్నారో దీనిపై టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news