పూరి జగన్నాథ్ లొంగిపోతాడా.! ఫైట్ చేస్తాడా.!

-

పూరి జగన్నాథ్ , విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వచ్చిన సినిమా లైగ‌ర్‌. విపరీత మైన ప్రచారంతో  పాన్ ఇండియా మూవీగా భారీ ఎత్తున విడుదల అయ్యి ,బాక్స్ ఆఫీస్ వద్ద  సినిమా బోల్తా పడింది. దీంతో  ఈ  సినిమా త‌ర్వాత పూరి మరియు ఛార్మి ఇద్దరూ మీడియాకు చాలా రోజుల నుండి దూరంగా వుంటున్నారు. తన తర్వాత సినిమా స్క్రిప్ట్ వర్క్ చేస్తూ ముంబయి హోటల్ లో వుంటున్నాడు.

ముందుగా  లైగర్ సినిమా తో నష్టపోయిన వారికీ సెటిల్ చేయాలని పూరీ ఒప్పుకున్నాడు. అయితే సమయం గడుస్తున్న ఇంకా అమౌంట్ రాకపోవడంతో పూరీ ఇంటి ముందు ధర్నా దిగాలని నిర్ణయించు కున్నారు. దీంతో ఒక ఆడియో లో ఇస్తానని ఒప్పుకున్నా ఇలా చేస్తారేంటి, అని అలా చేస్తే మీకు రూపాయి కూడా ఇవ్వను అని చెప్పాడు. అయినా కూడా వేదింపులు జరుగుతుండడం తన భార్య పిల్లల ను బెదిరించడం చేయటం తో  పూరీ పోలీసులకు ఫిర్యాదు చేసాడు.

దీంతో ఈ వివాదం  మరో మలుపు తిరిగింది. మాకు ఇస్తానన్న డబ్బులు ఇవ్వకుండా మళ్లీ తమపై బెదిరింపు కేసు పెట్టడం తో అందుకే ఫైనాన్షియర్లు అందరు కలిసి  ఇకపై పూరీ సినిమాలకు ఫైనాన్స్ చేయకూడదు అని నిర్ణయించుకున్నట్టు వార్తలు వచ్చాయి.అలాగే  పూరీ తీసే సినిమాలను డిస్టిబ్యూట్ కూడా చేయకూడదని ఇతడిని బాయ్ కాట్ చేయాలని ఆలోచిస్తున్నట్టు గుస గుసలు వినిపిస్తున్నాయి. ఇలా జరిగితే మాత్రం పూరీ కెరియర్ చిక్కుల్లో పడ్డట్లు అవుతుంది. మరి పూరీ ఈ వివాదాన్ని ఎలా ఎదుర్కోవాలో అని తీవ్రంగా ఆలోచిస్తున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news