ప్రముఖ సీరియల్ నటి వైశాలి ఆత్మహత్య

-

ప్రముఖ బుల్లితెర నటి వైశాలి ఠక్కర్ (29) ఆత్మహత్య చేసుకుంది. మధ్యప్రదేశ్ ఇండోర్ లోని తన ఇంట్లో ఆమె ఉరివేసుకొని చనిపోయింది. స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తూ ఉండగా.. ఘటన స్థలంలో ఓ సూసైడ్ నోట్ లభించింది. వైశాలి ప్రసిద్ధ టీవీ సీరియల్ “ఏ రిష్తా క్యా కేహలాత హై” లో పని చేశారు.

హిందీ బిగ్ బాస్ లో సైతం ఆమె పాల్గొంది. సూపర్ సిస్టర్స్, మన్మోహిని 2 వంటి సీరియల్స్ ఆమెకు పేరు తెచ్చిపెట్టాయి. తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వైశాలి.. తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను కూడా అభిమానులతో పంచుకునేది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కి వైశాలి మంచి స్నేహితురాలు. వైశాలి ఆత్మహత్యతో టీవీ ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపింది.

Read more RELATED
Recommended to you

Latest news