వైరల్ గా మారుతున్న అన్ స్టాపబుల్ ఎపిసోడ్ -2 ప్రోమో..!!

-

నటసింహ బాలకృష్ణ గురించి ఎంత చెప్పినా తక్కువే. బాలకృష్ణ ఎలాంటి విషయాన్ని అయినా సరే ముక్కుసూటిగా చెబుతూ ఉంటారు. ఇక బాలయ్య అన్ స్టాపబుల్ షో తో ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నారు. ఇక బాలకృష్ణ వ్యక్తిత్వం గురించి ఎవరిని అడిగినా సరే చిన్నపిల్లలు మనసత్వం కలిగిన వ్యక్తి అంటూ తెలియజేస్తూ ఉంటారు. ముఖ్యంగా అన్ స్టాపబుల్ షోలో హోస్టుగా వ్యవహరిస్తున్నప్పటి నుంచి బాలయ్యలో కాస్త చలాకీ తనం కనిపిస్తోంది. అయితే మొదటి సీజన్ చంద్రబాబు నాయుడు , నారా లోకేష్ తో ప్రారంభించారు.

ఇప్పుడు తాజాగా సెకండ్ ఎపిసోడ్ ప్రోమో ని విడుదల చేయడం జరిగింది ఆహా సంస్థ. ఇక ఇందులో విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ గెస్ట్లుగా రావడం జరిగింది. ఇందులో సిద్ధు గురించి బాలయ్య మాట్లాడుతూ.. మేకప్ మ్యాన్ హెయిర్ స్టైలిష్ ఎవరయ్యా సిద్దు బాబు అలా తల దువ్వకుండా పంపించారు అంటూ బాలయ్య అనగా మెస్సి లుక్ లో కనిపించిన చిత్రాలని ప్లాప్ అయ్యాయని సరదాగా చెప్పారు. అలాగే ఇందులో నిర్మాత నాగవంశీ కూడా కనిపించడం జరిగింది. ఇక ఆ వెంటనే డైరెక్టర్ త్రివిక్రమ్ కు ఫోన్ చేసి అన్ స్టాపబుల్ కి ఎప్పుడు వస్తున్నావ్ అని ప్రశ్నించగా మీరు ఓకే అంటే వెంటనే వచ్చేస్తా అని చెప్పగా.. ఎవరితో రావాలో తెలుసుగా అని బాలయ్య అంటారు.

ఇక ఇందులో బాలయ్యను ఇప్పట్లో మీకు ఏ హీరోయిన్ అంటే కరస్ అని అడగగా వెంటనే రష్మిక పేరు చెబుతారు. ఇక సిద్ధు జొన్నలగడ్డకి ఎవరని అడగగా.. టిఆర్ఎస్ అద్వానీ అని చెబుతారు. ఇక వెంటనే బాలయ్య షూటింగ్ లేకపోయినా అంటూ నవ్వేస్తారు. అయితే ఆ పక్కనే ఉన్న విశ్వక్ సేన్ మాత్రం ఇందులోకి లాగలేదు. ప్రస్తుతం అన్ స్టాపబుల్ -2 వ ఎపిసోడ్ కి సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news