“భీమ్లా నాయక్‌” వివాదంపై సిఎం జ‌గ‌న్ ను క‌లిసిన పోసాని

-

సిఎం వైఎస్ జ‌గ‌న్ ను సినిమా న‌టుడు పోసాని కృష్ణ ముర‌ళి క‌లిశారు. తమ కుటుంబం క‌రోనాతో భాద‌ప‌డుతున్న స‌మ‌యంలో సిఎం, ఆయ‌న స‌తీమ‌ణి మాట సాయం చేశారని.. ఏఐజి ఆసుప‌త్రికి ఫోన్ చేసి మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారని ఈ సందర్భంగా పోసాని చెప్పారు.
అందుకే సిఎం వైఎస్ జగన్ ను క‌లిసి కృత‌జ్జ‌త‌లు తెలిపానని..సినిమా టికెట్ల‌ ధరల పెంపు పై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.


చిన్న‌ సినిమాల నుండి ప్ర‌తిపాద‌న‌లు అందా‌కే టికెట్ల‌ ధ‌ర‌ల‌పై నిర్ణ‌యం వ‌స్తుందని.. సీఎంతో సమావేశంలో సినిమా టికెట్ల ధ‌ర‌లపై నేను చ‌ర్చించ‌లేదని క్లారిటీ ఇచ్చారు. ఆలీకి ఇచ్చిన‌ట్టే త‌న‌కు ప‌ద‌వి ఇస్తున్నారు అనడంలో వాస్త‌వం లేదని.. భీమ్లానాయ‌క్ సినిమా కు టికెట్ల గురించి నాకు తెలియ‌దన్నారు.

నేను సినిమా వాడినే గానీ దాని గురించి నాకు తెలియదని.. భీమ్లానాయ‌క్ సినిమాను ప్రభుత్వం ఉద్దేశ పూర్వ‌కంగా ఇబ్బంది పెట్టార‌ని ఆరోపించడం సరికాదని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇబ్బంది పెట్టినట్లు మీ ద‌గ్గ‌ర సాక్ష్యం ఉంటే చెప్పండి నా ద‌గ్గ‌ర లేదని..సీఎం జ‌గ‌న్ మీద నింద‌లు వేసిన వాడు భూమిలో 100 అడుగుల‌ లోతుకు పాతుకుపోతాడని ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news