రైతులకు శుభవార్త..పాసుపుస్తకాల్లో తప్పులను సవరించుకునేందుకు అవకాశం

-

తెలంగాణ రైతులకు కేసీఆర్‌ సర్కార్‌ శుభవార్త చెప్పింది. పట్టాదారు పాసుపుస్తకాల్లో ఉన్న తప్పులను సవరించుకునేందుకు కేసీఆర్‌ సర్కార్‌ అవకాశం కల్పించింది. ఈ మేరకు ధరణి పోర్టల్‌ లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. అప్లికేషన్‌ ఫర్‌ పాస్‌ బుక్‌ డేటా కరెక్షన్‌ పేరిట కొత్త షెడ్యూల్‌ ను తీసుకొచ్చింది.

పాసు పుస్తకాల్లో పేరు మార్పు, భూమి స్వభావం, వర్గీకరణ, రకం మార్పు, విస్తీర్ణం సరిచేయడం, మిస్సింగ్‌ సర్వే- సబ్‌ డివిజన్‌ నంబర్లు, నోషనల్‌ ఖాతాల నుంచి భూమి బదిలీ, భూమి అనుభవంలో మార్పునకు అవకాశం కల్పించారు.

మంత్రి వర్గ ఉప సంఘం సిఫార్సుల మేరకు ధరణి పోర్టల్‌ లో ఈ వెసులుబాటు తీసుకొచ్చారు. దీంతో పాసు పుస్తకంలో తప్పిదాలనున సవరించుకునే అవకాశం కలిగింది. మొత్తం 8 రకాల సవరణలకు ఆస్కారం ఏర్పడింది. చిన్న పాటి తప్పులు, పొరపాట్లు, ముద్రణా దోషాల కారణంగా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, సవరణకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వానికి భారీ సంఖ్యలో విజ్ఞప్తులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ అవకాశం ఇచ్చారు.

 

Read more RELATED
Recommended to you

Latest news