పోస్టాఫీస్‌ సూపర్ స్కీమ్.. లక్ష పెట్టుబడితో రెట్టింపు రాబడి..

-

ఎంతో కష్టపడితే కానీ డబ్బులు రావు..వచ్చిన డబ్బులను వచ్చినట్లు ఖర్చు కాకుండా కొంతమంది పొదుపు పథకాలలో ఇన్వెస్ట్ చెయ్యాలని అనుకుంటారు.. అయితే బ్యాంకులు, పోస్టాఫీసు, వివిధ ఆర్థిక సంస్థలు అన్నీ పెట్టుబడిదారులకు నమ్మకం కలిగిస్తూ వివిధ పథకాలను ప్రవేశపెడతున్నాయి.. పెట్టుబడిదారులు కూడా ఎక్కువ వడ్డీ రేట్లు ఇచ్చే మంచి పథకాల గురించి వెతుకుతూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఆర్‌బీఐ తీసుకున్న చర్యల కారణంగా బ్యాంకులు, పోస్టాఫీసులు వడ్డీ రేట్లు గణనీయంగా పెంచుతున్నాయి. ప్రస్తుతం పోస్టాఫీస్ వివిధ పథకాలకు వడ్డీ రేట్లు పెంచుతున్నట్లు ప్రభుత్వం ఏప్రిల్ 1న ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో ఇప్పుడు వడ్డీలు మారాయి..

 

అయితే ప్రస్తుతం పోస్టాఫీసులో అందుబాటులో ఉన్న ఓ కొత్త పథకం గురించి ఓ సారి తెలుసుకుందాం. కిసాన్ వికాస్ పత్ర పేరుతో ఉండే ఈ పథకంలో మనం ఎంత పెట్టుబడి పెడితే అంత తిరిగి మనకు వస్తుంది.. అంటే లక్షకు మరో లక్ష లాభం వస్తుంది.. అంటే మీ చేతికి రెండు లక్షలు లాభం వస్తుంది.. ఇటీవల కిసాన్ వికాస్ పత్రపై 7.5 శాతం వడ్డీని ప్రకటించారు. పెంచకముందు ఈ వడ్డీ రేట్ 7.2 శాతంగా ఉంది. బ్యాంకులన్నీ ఫిక్స్డ్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను గణనీయం పెంచడంతో ప్రభుత్వంపై కిసాస్ వికాస్ పత్ర తదితర పోస్టాఫీస్ పథకాలను వడ్డీని పెంచింది.

వచ్చే ఏడాదికి మొదటి త్రైమాసిక ఆర్థిక సంవత్సరానికి కిసాన్ వికాస్ పత్ర వడ్డీ రేటును 7.5 శాతం పెంచింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారిక నోటిఫికేషన్ ప్రకారం కేవీపీ పథకం 115 నెలల్లో మెచ్యూర్ అవుతుంది. కేవీపీతో పాటు కేంద్రం వివిధ పోస్టల్ పథకాల రేట్లను కూడా పెంచింది.. అదే విధంగా సీనియర్ సిటీజన్లకు, సుకన్య సమృద్ధి యోజన, మిగిలిన పథకాలలో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు అధిక వడ్డీని పొందవచ్చు.. ప్రస్తుతం అన్ని పథకాల పై వడ్డీ పెరిగింది..మరో మూడు నెలల్లో వడ్డీ ఇంకాస్త పెరగనున్నట్లు సమాచారం..

Read more RELATED
Recommended to you

Latest news