ప్రశాంత్‌ నీల్‌ జూ.ఎన్టీఆర్‌కి హ్యాండ్‌ ఇచ్చినట్లేనా…!

-

కె.జి.ఎఫ్.తో పాన్‌ ఇండియన్‌ హిట్‌ కొట్టిన దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. యశ్‌కి సూపర్‌ స్టార్డమ్‌ తెచ్చిపెట్టిన ఈ దర్శకుడు ‘కె.జి.ఎఫ్.-2’ తర్వాత జూ.ఎన్టీఆర్‌తో సినిమా చేస్తాడని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఈ దర్శకుడు తారక్‌ కంటే, ప్రభాస్‌ని ప్రిఫర్‌ చేస్తున్నాడని తెలుస్తుంది.

ప్రభాస్‌కి పాన్‌ ఇండియన్‌ స్టార్‌ అనే ఇమేజ్‌ ఉంది. ‘బాహుబలి’తో నార్త్ల్‌లోనూ స్టార్డమ్‌ సంపాదించుకుని వరుసగా పాన్‌ ఇండియన్‌ మూవీస్‌ చేస్తున్నాడు. ‘రాధేశ్యామ్, ఆదిపురుష్,‌’ నాగ్‌ అశ్విన్‌తో సైన్స్‌ ఫిక్షన్‌ డ్రామా.. అన్నీ మల్టీలింగ్వల్స్‌గానే వస్తున్నాయి. దీంతో ప్రభాస్‌తో సినిమా చేస్తే కెరీర్‌కి ప్లస్‌ అవుతుంది అనుకుంటున్నాడట ప్రశాంత్‌ నీల్.

జూ.ఎన్టీఆర్ స్టార్డమ్‌ తెలుగుకే పరిమితమైంది. ఈ ఇమేజ్‌ పెంచుకోవడానికి నెక్ట్స్ ‘ట్రిపుల్ ఆర్’తో నార్త్‌కి వెళ్తున్నాడు. దీంతో తారక్‌కి పాన్‌ ఇండియన్‌ ఇమేజ్ వచ్చాక చూద్దాం, ఇప్పుడైతే ప్రభాస్‌తో సినిమా అనౌన్స్‌ చేద్దాం అనే ఆలోచనలో ఉన్నాడట ప్రశాంత్. బాహుబలి బర్త్‌డే సందర్భంగా అక్టోబర్ 23న ఈ సినిమాని అనౌన్స్‌ చేస్తారని టాక్ వస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news