కృతి సనన్ తో ఎంగేజ్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన ప్రభాస్ టీం…

-

గత కొంతకాలంగా పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్‌  తో నటి కృతి సనన్  ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఎన్నో సందర్భాల్లో దీని గురించి ప్రచారం జరగగా.. ఈ నటులు ఇద్దరూ కూడా ఆ వార్తలను కొట్టి పారేశారు. అయినా వార్తలకు ఏమాత్రం బ్రేక్ పడట్లేదు. ఈ తరుణంలో వారిద్దరూ మాల్దీవుల్లో నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ విషయాన్ని తెలుపుతూ స్వయం ప్రకటిత సినీ విమర్శకుడు ఉమైర్‌ సంధు ట్విట్టర్‌లో తాజాగా ఓ పోస్ట్‌ని షేర్‌ చేశాడు. అందులో.. ‘బ్రేకింగ్ న్యూస్: కృతిసనన్, ప్రభాస్‌ నిశ్చితార్థం వచ్చే వారం మాల్దీవులలో జరగనుంది!! వారి చాలా సంతోషిస్తున్నాను’ అని రాసుకొచ్చాడు. దీంతో వీరిద్దరూ పెళ్లి గురించి న్యూస్‌ మరింత పెరిగిపోయాయి. దీంతో ఈ వార్తలపై తాజాగా ప్రభాస్‌ టీం స్పందించింది. ‘ఆ కథనాలలో ఎటువంటి నిజం లేదు. ఇది కేవలం కొందరి ఊహ మాత్రమే. ప్రభాస్, కృతి ఇద్దరూ సహ-నటులు, మంచి స్నేహితులు మాత్రమే’ అని ప్రభాస్‌ సన్నిహితులు చెప్పుకొచ్చారు.

కాగా.. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్’ చిత్రంలో ప్రభాస్, కృతి సనన్ జంటగా నటిస్తున్నారు. రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సీత, రాముడి పాత్రల్లో వీరు నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉంది. నిజానికి ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే టీజర్ విడుదల తర్వాత గ్రాఫిక్స్‌‌తో పాటు ఇతర అంశాలపై విమర్శలు రావడంతో జూన్ 16, 2023కి ఈ మూవీ విడుదలని వాయిదా వేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news