మరో కీలక పదవికి ప్రశాంత్ కిషోర్ రాజీనామా

-

పంజాబ్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పంజాబ్‌ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. ఈ క్రమంలో పంజాబ్‌ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ ప్రిన్సిపల్‌ సలహాదారుగా ఉన్న రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ తన పదవికి రాజీనామా చేశారు. తాను ప్రజా జీవితం లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు వీలుగా సలహాదారు పదవికి రాజీనామా చేసినట్లు ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

Political Strategist Prasanth Kishor

తన భవిష్యత్తు కార్యాచరణపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకో లేదని.. దయ చేసి తనను ఈ బాధ్యత నుంచి విముక్తిడిని చేయాలని ఆయన సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. భవిష్యత్తులో ప్రశాంత్‌ కిషోర్‌ క్రియాశీల రాజకీయాల్లోకి దిగనున్నారనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన పంజాబ్‌ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ ప్రధాన సలహాదారు పదవికి రాజీనామా చేయడం ప్రస్తుత రాజకీయల్లో కొత్త చర్చకు తెర లేపింది.

Read more RELATED
Recommended to you

Latest news