కేసీఆర్ తో భేటీ అయిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్

-

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్… తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేయనున్నారు. దీని కోసం ప్రత్యేకంగా సీఎం కేసీఆర్ తో భేటీ అయినట్లు తెలిసింది. టీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను, డెవలప్మెంట్ ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళికలను ప్రశాంత్ కిషోర్ టీం సిద్ధం చేసినట్లు తెలిసింది. త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా ప్రశాంత్ కిషోర్ టీం పర్యటించనుంది. ఇందుకోసమే కేసీఆర్ ప్రశాంత్ కిషోర్ భేటీ అయినట్లు సమాచారం. 

ఇప్పటికే ప్రశాంత్ కిషోర్, సినీ నటుడు ప్రకాష్ రాజ్ తో కలిసి మల్లన్న సాగర్ సందర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి, రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అవసరం గురించి తెలుసుకున్నారు. తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను తెలుసుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా సర్వే నిర్వహించేందుకు పీకే టీం సన్నద్ధం అవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే పీకే మమతా బెనర్జీ, స్టాలిన్ లకు పనిచేశారు. బెంగాల్, తమిళనాడులో పీకే పనిచేసిన ఈ రెండు పార్టీలు విజయం సాధించాయి.

Read more RELATED
Recommended to you

Latest news