బాలీవుడ్​పై సంచలన వ్యాఖ్యలు అందుకే చేశా.. ప్రియాంక చోప్రా క్లారిటీ

-

గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా ఇటీవలే బాలీవుడ్​పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బాలీవుడ్‌ రాజకీయాలతో విసిగిపోయానంటూ ప్రియాంకా తాను చేసిన వ్యాఖ్యలపై తాజాగా స్పందించింది. ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న ప్రియాంక ఇప్పుడెందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు? అంటూ వస్తోన్న ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ‘సిటాడెల్‌’ ప్రీమియర్‌లో భాగంగా పీసీ మీడియాతో ముచ్చటించింది.

‘‘ఇటీవల నేను ఆ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నప్పుడు అక్కడివాళ్లు నా జీవిత ప్రయాణం గురించి అడిగారు. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకూ నా జీవితంలో జరిగిన ప్రతి విషయాన్నీ వెల్లడించాను. అన్నీ నిజాలే చెప్పాను. నా జీవితంలో ఎదురైన ఆ దశ (బాలీవుడ్‌లోని రాజకీయాలు) గురించి మాట్లాడటానికి ఇన్నాళ్లకు నాకు ధైర్యం వచ్చిందని భావిస్తున్నాను. నాకు అనిపించిన ప్రతివిషయాన్ని ధైర్యంగా ప్రపంచానికి చెప్పే స్థాయికి చేరుకున్నాను. బాలీవుడ్‌లో అప్పుడు నాకు ఎదురైన పరిస్థితుల్లో ఎన్నో గందరగోళ సంబంధాలను చూశాను. జరిగిన వాటన్నింటినీ క్షమించి.. చాలా కాలం క్రితమే ముందుకు అడుగువేశాను. నా ప్రశాంతతను నేను చూసుకున్నా. అందుకే ఆనాటి రోజులను సులభంగా అందరితో పంచుకోగలిగాను’’ అని ప్రియాంక చెప్పుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version