ఇవాళ తెలంగాణ నాయకులతో ప్రియాంక గాంధీ కీలక సమావేశం

-

మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలోనే కాంగ్రెస్‌ పార్టీ లో ప్రక్షాళన మొదలైంది. కోమటిరెడ్డి పార్టీని వీడిన సరే మునుగోడులో కాంగ్రెస్ ని నిలబెట్టాలని రేవంత్ రెడ్డి ట్రై చేస్తున్నారు. ఇక హుజురాబాద్‌, దుబ్బాకలో తరహాలోనే కాకుండా, మునుగోడు ఉప ఎన్నికకు అభ్యర్థిని ముందుగానే ఖరారు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలకు ఢిల్లీ నుండి పిలుపు వచ్చింది.

ఢిల్లీకి రావాలని తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 8 మందికి సమాచారం పంపింది హై కమాండ్. ఈ నేపథ్యంలోనే ఆ నేతలు ఇవాళ ఢిల్లీ వెళుతున్నారు. ఇక ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు ప్రియాంక గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ కానున్నారు. వీరిలో భట్టి విక్రమార్క, రేవంత్‌ రెడ్డి, తదితరులు ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇక ఈ సమావేశంలో మునుగోడు ఎన్నికపై ప్రియాంక గాంధీ సమీక్ష చేయనున్నారు. అలాగే కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిని కూడా ఫైనల్‌ చేసే ఛాన్స్‌ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news