సినీ నటుడు పృథ్వి కార్ కి యాక్సిడెంట్ ?

-

ప్రముఖ నటుడు, ఎస్వీబీసీ మాజీ ఛైర్మన్ పృథ్వీరాజ్‌ కారు రోడ్డు ప్రమాదానికి గురయింది. అయితే ఈ ప్రమాదంలో ఆయనకు ఏమయినా గాయాలు అయ్యాయా ? లేదా అనే విషయం మీద క్లారిటీ లేదు. నిన్న ఈ ఘటన జరిగిందంటూ పృథ్వీ రాజ్‌ కి చెందిన ఫేస్‌ బుక్‌ పేజ్ లో ఒక పడేట్ ఇచ్చారు. ‘బంజారా హిల్స్ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర్లో ఉన్న వినాయకుడి గుడి దగ్గర పృథ్విరాజ్ వెళ్తుంటే ఒక ఇన్నోవా కార్ వచ్చి గుద్దింది బండి డ్యామేజ్ అయ్యింది జనం గుమిగూడారు, అంటూ ఆ యాక్సిడెంట్ లో ధ్వంసమైన కారుల ఫొటోలను షేర్‌ చేసారు.

అయితే ఆయనకు ఏమయినా గాయాలు అయ్యాయా ? అసలు ఆయన ఆ సమయంలో కార్ లో ఉన్నాడా ? లేడా అనే విషయం కూడా క్లారిటీ ఇవ్వలేదు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ఈయన సినీ నటుడిగా ఉంటూనే వైసీపీకి మద్దతు తెలిపారు. ఆ పార్టీ గెలిచాక ఎస్వీబీసీ ఛానల్ బాధ్యతలు కూడా అప్పగించారు. కానీ అనివార్య కారణాలతో ఆయన తప్పుకోవాల్సి వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news