పునీత్ రాజ్ కుమార్ కు ’కర్ణాటక రత్న‘ అవార్డ్

-

యావత్ కర్ణాటక రాష్ట్రాన్ని శోఖ సంద్రంలో ముంచి వెళ్లిపోయిన పునీత్ రాజ్ కుమార్ ను ఆ రాష్ట్ర ప్రజలు ఇప్పటికీ నమ్మలేకపోతున్నారు. చిన్న వయసులోనే తమ అభిమాన హీరో చనిపోయాడంటే ఇప్పటికీ ఎవ్వరూ నమ్మలేకపోతున్నారు. పునీత్ మృతి చెంది రెండు వారాలు పూర్తి కావోస్తున్న ఇప్పటికీ ఆయన సమాధి వద్దకు వేలాదిగా అభిమానులు తరలివస్తున్నారు. సమాధి వద్దే పెళ్లి చేసుకుంటామని ప్రేమ జంటలు చెబుతున్నాయంటే పునీత్ రాజ్ కుమార్ పై ఉన్న అభిమానం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. తన నటతో కాక సామాజిక సేవా కార్యక్రమాల ద్వాారా తన గొప్ప దాత్రుత్వ గుణాన్ని చాటుకున్నాడు.puneeth rajkumar

దివంగత పునీత్ రాజ్ కుమార్ కు మరణానంతరం ’కర్ణాటక రత్న‘ పురస్కారాన్ని ప్రకటించింది కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం. ఈ  కార్యక్రమంలో పాల్గోన్న ముఖ్యమంత్రి బసవరాజు మాట్లాడుతూ.. పునీత్ రాజ్ కుమార్‏కు కర్ణాటక రత్న అవార్డు ఇవ్వనున్నట్లుగా తెలిపారు. బెంగుళూరులోని ప్యాలెస్ గ్రౌండ్స్ లో పునీత్ నమన అనే పేరుతో ఈ సంస్మరణ సభ కార్యక్రమాన్ని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (KFCC), శాండల్ వుడ్ ఫిల్మ్ యాక్టర్స్, టెక్నీషియన్స్ అసోసియేషన్స్ కలిసి నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో శాండల్ వుడ్ సినీ నటులతో పాటు, ఇతర రాష్ట్రాల సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. కర్ణాటక సీఎంతో పాటు మాజీ సీఎం యడియూరప్ప, మంత్రులు హాజరయ్యారు. పునీత్ రాజ్ కుమార్ కర్ణాటకకు చేసిన సేవల్ని పలువురు కొనియాడారు.

Read more RELATED
Recommended to you

Latest news