ఏపీ ఆర్టీసీ కీలక నిర్ణయం..మరో 1000 అద్దె బస్సుల కొనుగోలు

-

ఏపీ ఆర్టీసీ కీలక నిర్నయం తీసుకుంది. సొంత బస్సుల కొనుగోలుపై దృష్టి పెట్టాల్సిన ఆర్టీసీ, అద్దె బస్సులను పెంచుకుంటుంది. ఇటీవలే 900 అద్దె బస్సులను తీసుకున్న సంస్థ మరో వెయ్యి తీసుకోనుంది. ఖర్చు తగ్గించుకునేందుకు ఇలా అడుగులు వేస్తుండటంతో ప్రతి 3 ఆర్టీసీ బస్సుల్లో ఒకటి అద్దెది కానుంది. ఫలితంగా సంస్థలోని పలు పోస్టులు తగ్గనున్నాయి.

ఆర్టీసీలో ఒక బస్సుకు డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్, నిర్వహణ సిబ్బంది కలిపి సగటున ఐదుగురు అవసరం. పల్లె వెలుగు వంటి అద్దె బస్సుల్లో ఆర్టీసీ తరఫున కండక్టర్ ఒక్కరే ఉంటారు. ఏసీ, సూపర్ లగ్జరీ వంటి దూర ప్రాంత అద్దె బస్సుల్లో డ్రైవర్లే టికెట్లు ఇస్తుంటారు. వారు బస్సు యజమానికి చెందినవారే. అంటే వీటికి ఆర్టిసి సిబ్బంది అవసరం ఉండదు. ఈ లెక్కన కొత్తగా తీసుకోనున్న వెయ్యి బస్సులకు ఆర్టీసీ తరపున 3000 మంది వరకు సిబ్బంది అవసరం ఉండదని తెలిసింది. అంటే ఈ మేరకు సంస్థలు పోస్టులకు మంగళం పాడినట్లే అవుతుందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news