మేం చెవులో పువ్వులు పెట్టుకోలేదు: పువ్వాడ అజయ్

-

హైదరాబాద్: తాము చెవులో పువ్వులు పెట్టుకోలేదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎద్దేవా చేశారు. తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న జలజగడంపై ఆయన స్పందించారు. మరో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.. జగన్‌పై చేసిన వ్యాఖ్యలకు పువ్వాడ అజయ్ మద్దతిచ్చారు. వైఎస్ హయాంలో రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టలేదన్నారు. ఎన్జీటీ తీర్పును ఏపీ పట్టించుకోలేదని చెప్పారు. వెంటనే కేంద్రం ఇరురాష్ట్రాలతో చర్చించాలని తెలిపారు. పోతిరెడ్డి ప్రాజెక్టు ముమ్మాటికీ అక్రమమే అని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ మాటలకు వక్రభాష్యం చెబుతున్నారని మండిపడ్డారు. నీటి వాటాను ట్రిబ్యునల్ తేల్చలేదని వ్యాఖ్యానించారు.

తెలంగాణ ప్రజల హక్కులను కాపాడేందుకు తాము మాట్లాడుతున్నామన్నారు. ఖమ్మం జిల్లా ప్రజల హక్కు కోసం మంత్రిగా తాను మాట్లాడొద్దా అని ప్రశ్నించారు. తమ హీరో కేసీఆర్ అని చెప్పారు. తెలంగాణ సమాజానికే కేసీఆర్ హీరో అని అన్నారు. తాము హీరోయిజం చూపించుకోవడానికి మాట్లాడటంలేదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చేతకాని వాళ్లని పువ్వాడ విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news